Share News

గణాంకాలతోనే దిశ..!

ABN , First Publish Date - 2023-11-28T02:50:25+05:30 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం రేంజ్‌ బౌండ్‌లోనే కొనసాగే అవకాశం ఉంది. నిఫ్టీ, సెన్సెక్స్‌ ప్రస్తుత మద్దతు, నిరోధ స్థాయిలను బ్రేక్‌ చేసేంత వరకు మార్కెట్ల గమనాన్ని అంచనా వేయటం కష్టం...

గణాంకాలతోనే దిశ..!

గణాంకాలతోనే దిశ..!

దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం రేంజ్‌ బౌండ్‌లోనే కొనసాగే అవకాశం ఉంది. నిఫ్టీ, సెన్సెక్స్‌ ప్రస్తుత మద్దతు, నిరోధ స్థాయిలను బ్రేక్‌ చేసేంత వరకు మార్కెట్ల గమనాన్ని అంచనా వేయటం కష్టం. అయితే యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుతుండటం సానుకూల అంశం. యూరప్‌, అమెరికాల్లో ద్రవ్యోల్బణం తగ్గటం ఇన్వెస్టర్లలో పాజిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమవుతోంది. అన్‌సెక్యూర్డ్‌ రుణాలపై ఆర్‌బీఐ నిబంధనల కారణంగా బ్యాంకు షేర్లు మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ వారం సెప్టెంబరు త్రైమాసిక జీడీపీ గణాంకాలు, పీఎంఐ డేటా మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించే వీలుంది.

స్టాక్‌ రికమండేషన్స్‌

కజారియా సిరామిక్స్‌: గత మూడు నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో సాగుతూ వస్తున్న ఈ కౌంటర్‌కు రూ.1,200 స్థాయిలో మద్దతు లభించింది. క్రమంగా మూమెంటమ్‌ పెరుగుతోంది. డివిడెండ్‌ ప్రకటించిన తర్వాత స్టాక్‌లో స్థిరత్వం పెరిగింది. గత శుక్రవారం రూ.1,313 వద్ద క్లోజైన ఈ షేరును ట్రేడర్లు రూ.1,300 వద్ద పొజిషన్‌ తీసుకుని రూ.1,360/1,450 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,260 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

క్యాస్ట్రాల్‌ ఇండియా: రెండు నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ కౌంటర్‌లో మళ్లీ కొనుగోళ్ల జోష్‌ కనిపిస్తోంది. చివరి రెండు సెషన్లలో ట్రేడింగ్‌, డెలివరీ వాల్యూమ్‌ పెరిగింది. గత శుక్రవారం రూ.140 వద్ద క్లోజైన ఈ షేరును ట్రేడర్లు రూ.136/139 స్థాయిల్లో పొజిషన్‌ తీసుకుని రూ.155/162 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.134 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

బీహెచ్‌ఈఎల్‌: సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలు విడుదల చేసినప్పటి నుంచి ఈ కౌంటర్‌లో అప్‌ట్రెండ్‌ మొదలైంది. గత శుక్రవారం రెండు బ్లాక్‌ డీల్స్‌ జరగటంతో ఈ షేరు మంచి లాభాలతో రూ.152 వద్ద క్లోజైంది. మూమెంటమ్‌ ఇన్వెస్టర్లు రూ.150/145 స్థాయిల్లో పొజిషన్‌ తీసుకుని రూ.175/190 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలివంచవచ్చు. అయితే రూ.140 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి ఈ కౌంటర్‌ డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. ద్వితీయ త్రైమాసిక ఫలితాలు వచ్చిన షేరు పతనం ఆగింది. ఇప్పుడిప్పుడే ట్రెండ్‌ రివర్సల్‌ మొదలైంది. జెఫ్రీస్‌ భారత పోర్టుఫోలియోలో ఈ కంపెనీని చేర్చటం సానుకూలంగా మారింది. గత శుక్రవారం ఈ షేరు రూ.1,532.10 వద్ద క్లోజైంది. ట్రేడర్లు రూ.1,520/1,500 స్థాయిల్లో పొజిషన్‌ తీసుకుని రూ.1,650/1,720 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,470 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

దివీస్‌ లేబొరేటరీస్‌: ఫార్మా విభాగంలో మళ్లీ మూమెంటమ్‌ కనిపిస్తోంది. మార్జిన్లు పెరుగుతాయనే అంచనాలే కారణం. ద్వితీయ త్రైమాసిక ఫలితాల అనంతరం ఈ షేరులో అప్‌ట్రెండ్‌ మొదలైంది. గత శుక్రవారం రూ.3,764 క్లోజైన ఈ షేరును ట్రేడర్లు రూ.3,750 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.4,070/4,155 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.3,720 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

- మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్ట్‌ మాస్టర్‌

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.


దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారం రేంజ్‌ బౌండ్‌లోనే కొనసాగే అవకాశం ఉంది. నిఫ్టీ, సెన్సెక్స్‌ ప్రస్తుత మద్దతు, నిరోధ స్థాయిలను బ్రేక్‌ చేసేంత వరకు మార్కెట్ల గమనాన్ని అంచనా వేయటం కష్టం. అయితే యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుతుండటం సానుకూల అంశం. యూరప్‌, అమెరికాల్లో ద్రవ్యోల్బణం తగ్గటం ఇన్వెస్టర్లలో పాజిటివ్‌ సెంటిమెంట్‌కు కారణమవుతోంది. అన్‌సెక్యూర్డ్‌ రుణాలపై ఆర్‌బీఐ నిబంధనల కారణంగా బ్యాంకు షేర్లు మరింత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ వారం సెప్టెంబరు త్రైమాసిక జీడీపీ గణాంకాలు, పీఎంఐ డేటా మార్కెట్‌ గమనాన్ని నిర్దేశించే వీలుంది.

స్టాక్‌ రికమండేషన్స్‌

కజారియా సిరామిక్స్‌: గత మూడు నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో సాగుతూ వస్తున్న ఈ కౌంటర్‌కు రూ.1,200 స్థాయిలో మద్దతు లభించింది. క్రమంగా మూమెంటమ్‌ పెరుగుతోంది. డివిడెండ్‌ ప్రకటించిన తర్వాత స్టాక్‌లో స్థిరత్వం పెరిగింది. గత శుక్రవారం రూ.1,313 వద్ద క్లోజైన ఈ షేరును ట్రేడర్లు రూ.1,300 వద్ద పొజిషన్‌ తీసుకుని రూ.1,360/1,450 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,260 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

క్యాస్ట్రాల్‌ ఇండియా: రెండు నెలలుగా డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతున్న ఈ కౌంటర్‌లో మళ్లీ కొనుగోళ్ల జోష్‌ కనిపిస్తోంది. చివరి రెండు సెషన్లలో ట్రేడింగ్‌, డెలివరీ వాల్యూమ్‌ పెరిగింది. గత శుక్రవారం రూ.140 వద్ద క్లోజైన ఈ షేరును ట్రేడర్లు రూ.136/139 స్థాయిల్లో పొజిషన్‌ తీసుకుని రూ.155/162 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.134 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

బీహెచ్‌ఈఎల్‌: సెప్టెంబరు త్రైమాసిక ఫలితాలు విడుదల చేసినప్పటి నుంచి ఈ కౌంటర్‌లో అప్‌ట్రెండ్‌ మొదలైంది. గత శుక్రవారం రెండు బ్లాక్‌ డీల్స్‌ జరగటంతో ఈ షేరు మంచి లాభాలతో రూ.152 వద్ద క్లోజైంది. మూమెంటమ్‌ ఇన్వెస్టర్లు రూ.150/145 స్థాయిల్లో పొజిషన్‌ తీసుకుని రూ.175/190 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలివంచవచ్చు. అయితే రూ.140 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన నాటి నుంచి ఈ కౌంటర్‌ డౌన్‌ట్రెండ్‌లో కొనసాగుతోంది. ద్వితీయ త్రైమాసిక ఫలితాలు వచ్చిన షేరు పతనం ఆగింది. ఇప్పుడిప్పుడే ట్రెండ్‌ రివర్సల్‌ మొదలైంది. జెఫ్రీస్‌ భారత పోర్టుఫోలియోలో ఈ కంపెనీని చేర్చటం సానుకూలంగా మారింది. గత శుక్రవారం ఈ షేరు రూ.1,532.10 వద్ద క్లోజైంది. ట్రేడర్లు రూ.1,520/1,500 స్థాయిల్లో పొజిషన్‌ తీసుకుని రూ.1,650/1,720 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,470 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

దివీస్‌ లేబొరేటరీస్‌: ఫార్మా విభాగంలో మళ్లీ మూమెంటమ్‌ కనిపిస్తోంది. మార్జిన్లు పెరుగుతాయనే అంచనాలే కారణం. ద్వితీయ త్రైమాసిక ఫలితాల అనంతరం ఈ షేరులో అప్‌ట్రెండ్‌ మొదలైంది. గత శుక్రవారం రూ.3,764 క్లోజైన ఈ షేరును ట్రేడర్లు రూ.3,750 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.4,070/4,155 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.3,720 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్ట్‌ మాస్టర్‌

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

Updated Date - 2023-11-28T02:50:51+05:30 IST