Tata Motors: నేషనల్ ఎక్స్‌చేంజ్ కార్నివాల్.. రూ. 60 వేల ప్రయోజనాలు

ABN , First Publish Date - 2023-02-04T19:45:33+05:30 IST

దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్(Tata Motors) నేడు

Tata Motors: నేషనల్ ఎక్స్‌చేంజ్ కార్నివాల్.. రూ. 60 వేల ప్రయోజనాలు

ముంబై: దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్(Tata Motors) నేడు ‘నేషనల్ ఎక్స్‌చేంజ్ కార్నివాల్’(National Exchange Carnival)ను ప్రారంభించింది. ఇందులో భాగంగా బోల్డన్ని ఆఫర్లు ప్రకటించింది. వినియోగదారులు ఏదైనా డీలర్‌షిప్‌ను సందర్శించడం ద్వారా టాటా కార్లు, ఎస్‌యూవీలపై ఆకర్షణీయమైన ప్రయోజనాలను పొందొచ్చు. ఎంపిక చేసిన మోడళ్లపై రూ. 60 వేల వరకు మార్పిడి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ మెగా కార్నివాల్ ఈ కస్టమర్ సెంట్రిక్ ఇనిషియేటివ్‌లో భాగంగా 250 నగరాల్లోని టాటా మోటార్స్ అధీకృత డీలర్‌షిప్‌లలో ఈ నెల 15 వరకు కొనసాగుతుంది.

ఈ సందర్భంగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, సేల్స్, మార్కెటింగ్, కస్టమర్ కేర్ వైస్ ప్రెసిడెంట్ రాజన్ అంబ(Rajan Amba) మాట్లాడుతూ.. ఈ కార్నివాల్‌ను 12 రోజులపాటు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్నివాల్ తమ వినియోగదారులను వారికి ఇష్టమైన టాటా కారుకు సులభంగా అప్‌‌గ్రేడ్ చేయడంలో సహాయపడుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. తద్వారా వారు తాము అందించే డిజైన్, డ్రైవ్, భద్రత ఉత్తమ కలయికను ఆనందించవచ్చన్నారు.

టాటా మోటార్స్ అష్యూర్డ్ అనేది కంపెనీకి చెందిన ఇన్ హౌస్‌ ప్రీ-ఓన్డ్ కార్ ప్రోగ్రామ్. ఇది కస్టమర్‌లు తమ ప్రస్తుత కార్లను కొత్త టాటా కార్ల కోసం మార్చుకోవడానికి వన్-స్టాప్ సొల్యూషన్‌ను అందిస్తోంది. 2009లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రీ-ఓన్డ్ కార్ ప్రోగ్రాం కొనుగోలుదారులకు ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందించడంలో అద్భుతంగా పనిచేస్తోంది.

Updated Date - 2023-02-04T19:45:36+05:30 IST