Share News

కల్యాణ్‌ జువెలర్స్‌ అధినేత కల్యాణరామన్‌ ఆత్మకథ ‘ది గోల్డెన్‌ టచ్‌’ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2023-11-29T01:55:47+05:30 IST

ప్రముఖ వ్యాపారవేత్త, కల్యాణ్‌ జువెలర్స్‌ వ్యవస్థాపకుడు టీఎస్‌ కల్యాణరామన్‌ ఆత్మకథ ‘ది గోల్డెన్‌ టచ్‌’ను బాలీవుడ్‌ మెగాస్టార్‌, సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఆవిష్కరించారు...

కల్యాణ్‌ జువెలర్స్‌ అధినేత కల్యాణరామన్‌ ఆత్మకథ ‘ది గోల్డెన్‌ టచ్‌’ ఆవిష్కరణ

కల్యాణ్‌ జువెలర్స్‌ అధినేత కల్యాణరామన్‌ ఆత్మకథ ‘ది గోల్డెన్‌ టచ్‌’ ఆవిష్కరణ

హైదరాబాద్‌: ప్రముఖ వ్యాపారవేత్త, కల్యాణ్‌ జువెలర్స్‌ వ్యవస్థాపకుడు టీఎస్‌ కల్యాణరామన్‌ ఆత్మకథ ‘ది గోల్డెన్‌ టచ్‌’ను బాలీవుడ్‌ మెగాస్టార్‌, సంస్థ బ్రాండ్‌ అంబాసిడర్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఆవిష్కరించారు. ముంబైలో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో కల్యాణరామన్‌ తన ఆటోబయోగ్రఫీ తొలి కాపీని అమితాబ్‌ బచ్చన్‌కు అందజేశారు.కేరళలోని త్రిస్సూర్‌ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన కల్యాణరామన్‌.. తన వ్యాపార ప్రస్థానాన్ని, జీవిత అనుభవాలు, సవాళ్లను ది గోల్డెన్‌ టచ్‌లో వివరించారు. కల్యాణ్‌ జువెలర్స్‌ అధినేత కల్యాణరామన్‌ జీవితం... నేటి యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్ట్‌ప్సకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుందని అమితాబ్‌ బచ్చన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కల్యాణ్‌ జువెలర్స్‌ను అంతర్జాతీయ బ్రాండ్‌గా తీర్చిదిద్దటంలో కల్యాణరామన్‌ చేసిన కృషి మరువలేనిదని అన్నారు. తన ఆటోబయోగ్రఫీ దేశంలోని స్టార్ట్‌ప్సకు ఎంతో ప్రేరణగా నిలుస్తుందని తాను భావిస్తున్నట్లు కల్యాణ్‌రామన్‌ అన్నా రు. పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా ప్రచురించిన ఈ ఆటోబయోగ్రఫీ అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది.

Updated Date - 2023-11-29T01:56:29+05:30 IST