Char Dham Yatra : ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో నమోదైన భక్తులు

ABN , First Publish Date - 2023-06-18T12:00:27+05:30 IST

ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు నమోదు చేసుకున్నారు. శనివారంనాటికి 46.56 లక్షల మంది భక్తులతో సరికొత్త రికార్డు నమోదైంది. శనివారంనాటికి ఈ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్, కేదార్‌నాథ్ (మరియు హేమకుండ్ సాహిబ్) క్షేత్రాలను దర్శించుకున్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో 28.41 లక్షలకు చేరింది.

Char Dham Yatra : ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో నమోదైన భక్తులు

డెహ్రాడూన్ : ఈ ఏడాది చార్ ధామ్ యాత్రకు రికార్డు స్థాయిలో భక్తులు నమోదు చేసుకున్నారు. శనివారంనాటికి 46.56 లక్షల మంది భక్తులతో సరికొత్త రికార్డు నమోదైంది. శనివారంనాటికి ఈ యాత్రలో భాగంగా గంగోత్రి, యమునోత్రి, బదరీనాథ్, కేదార్‌నాథ్ (మరియు హేమకుండ్ సాహిబ్) క్షేత్రాలను దర్శించుకున్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో 28.41 లక్షలకు చేరింది.

ఉత్తరాఖండ్ పర్యాటకాభివృద్ధి మండలి సంయుక్త సంచాలకులు యోగేంద్ర గంగ్వార్ మాట్లాడుతూ, చార్ ధామ్, హేమకుండ్ సాహిబ్‌ల సందర్శన కోసం నమోదు చేయించుకున్న భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో 46,56,844కు చేరిందని చెప్పారు. వీరిలో 28,41,105 మంది బదరీనాథ్, కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి, హేమకుండ్ సాహిబ్‌లను దర్శించుకున్నారని తెలిపారు. 2022లో ఈ యాత్రలో పాల్గొన్న భక్తుల సంఖ్య 46,27,292 అని తెలిపారు. భక్తుల ఉత్సాహం, వారి కోసం తాము చేసిన ఏర్పాట్లను బట్టి ఈ ఏడాది ఈ యాత్రలో పాల్గొనే భక్తుల సంఖ్య 60 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.

ఇదిలావుండగా, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో భక్తులకు సాయపడే సిబ్బంది తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని అధికారులు తెలిపారు. ఈ యాత్ర ముగియడానికి ఇంకా నాలుగు నెలలు సమయం ఉంది.

ఇవి కూడా చదవండి

Rs.500 Notes : రూ.500 నోట్లు అదృశ్యం వార్తలపై ఆర్బీఐ స్పందన

Extreme heatwave : ఉత్తరాదిలో విపరీతమైన వడగాడ్పులు.. యూపీ, బిహార్ రాష్ట్రాల్లో 98 మంది మృతి..

Updated Date - 2023-06-18T12:00:27+05:30 IST