Home » National
దేశ సార్వత్రిక ఎన్నికల సమరంలో గెలిచేదెవరు.. కేంద్రంలో అధికారం చేపట్టేదెవరు.. ఇప్పటికే మూడు విడతల్లో సగానికి పైగా లోక్సభ స్థానాల్లో(Lok Sabha Seats) ఎన్నికలు పూర్తయ్యాయి. మొదటి మూడు విడతల్లో ఎవరిది అధిపత్యం అనేదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. మొదటి మూడు విడతల్లో పోలింగ్ తక్కువ నమోదైంది. బీజేపీకి ఈ మూడు విడతల్లో ఎదురుదెబ్బ తగిలిందని ఇండియా కూటమి ఆరోపిస్తుంటే.. ఎన్డీయే(NDA) బలం గతంకంటే పెరిగింది.. ఇండియా కూటమికి గతంలో వచ్చిన సీట్లు రావంటూ బీజేపీ(BJP) చెబుతోంది. ఈ క్రమంలో మొదటి మూడు విడతల్లో ఎవరిది అధిపత్యం అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో హిందూ, ముస్లిం అంటూ విభజన రాజకీయాలు చేస్తున్న నేతల నడుమ.. మత సామరస్యాన్ని చాటారు ఓ రాష్ట్ర గవర్నర్. అయోధ్య రాముడి గుడిని దర్శించుకుని నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు.
ఈరోజు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) పద్మవిభూషణ్ అవార్డు(Padma Vibhushan Award) అందుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి పద్మవిభూషణ్ అవార్డును స్వీకరించనున్నారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో రాయ్బరేలీ, అమేథీ ముందు వరుసలో ఉన్నాయి. గాంధీ కుటుంబానికి ఈ రెండు స్థానాలు ఎప్పటినుంచో సంప్రాదాయక సీట్లుగా ఉన్నాయి. కానీ 2019లో అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి చవిచూడగా.. రాయ్బరేలీలో సోనియాగాంధీ విజయం సాధించారు. ఈసారి సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్లడంతో.. రాయ్బరేలీ నుంచి ఆమె వారసుడిగా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది.
సిక్ లీవ్ పెట్టడంతో 19వేల మంది ప్రయాణికులకు ఇబ్బంది కలిగించినందుకు ఎయిర్ ఇండియా(Air India Express) తమ సిబ్బందిపై చర్యలు తీసుకుంది.
ఉత్తరప్రదేశ్లో ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య ప్రధాన పోరు కొనసాగుతున్న వేళ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్.. బీఎస్పీ అధినేత్రి మాయావతిని టార్గెట్ చేశారు. మరోవైపు అఖిలేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాయావతి. బీఎస్పీ నేషనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్ను మాయావతి తప్పించారు. ఏడాది క్రితం ఇచ్చిన వారసత్వ బాధ్యతల నుంచి కూడా తప్పించినట్లు ప్రకటించారు. దీంతో మాయావతి తీసుకున్న ఈ నిర్ణయంపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్స్లో ట్వీట్ చేశారు.
కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో బుధవారం రాత్రి భద్రతా బలగాలు టెర్రరిస్టులకు(Terrorists) మధ్య భారీ ఎన్ కౌంటర్(Encounter) జరిగింది. ఈ ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రోజుకో అంశం తెరమీదకు వస్తోంది. ప్రతిపక్షం ఒక అంశం తెరపైకి తీసుకొస్తే.. దానికి ధీటుగా అధికార పక్షం మరొక అంశాన్ని లేవనెత్తుతోంది. ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి అజెండా పక్కకు వెళ్లిపోయింది. అధికారంలోకి వస్తే ఏం చేస్తాం.. గతంలో ఏం చేశామనే ముచ్చట్లే లేవు. ఎన్నికల ప్రచారం మొత్తం రెండే రెండు అంశాల చుట్టూ తిరుగుతున్నాయి.
విరాళాల(Funds) సేకరణలో ఐఐటీ మద్రాస్ చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.513 కోట్లు విరాళాలుగా సమకూరినట్లు ఐఐటీ మద్రాస్(IIT Madras) సంచాలకుడు ప్రొఫెసర్ కామకోటి బుధవారం ప్రకటించారు.
కోర్టుల్లో వాదనల సమయంలో రాజకీయ అంశాలను ప్రస్తావించొద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం(Supreme Court) సూచించింది. పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.