Jammu: కశ్మీర్‌లో ఉద్రిక్తత.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

ABN , First Publish Date - 2023-09-30T16:30:29+05:30 IST

జమ్మూ కశ్మీర్‌(Jammu Kashmir)లోని కుప్వారా(Kupwara) జిల్లాలో నియంత్రణ రేఖ వెంట చొరబడటానికి ప్రయత్నించిన ఉగ్రవాదులు కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశారు.

Jammu: కశ్మీర్‌లో ఉద్రిక్తత.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

కశ్మీర్: జమ్మూ కశ్మీర్‌(Jammu Kashmir)లోని కుప్వారా(Kupwara) జిల్లాలో నియంత్రణ రేఖ వెంట చొరబడటానికి ప్రయత్నించిన ఉగ్రవాదులు కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారని పోలీసులు తెలిపారు. వారు వివరాల ప్రకారం.. ఉత్తర కశ్మీర్ జిల్లాలోని మచిల్ సెక్టార్‌(Machil Sector)లోని కుంకడి ప్రాంతంలో చొరబాటు ప్రయత్నం జరిగింది.


ఈ ఘటనలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య పరస్పర కాల్పులు జరిగాయి. ముష్కరుల నుంచి రెండు ఏకే రైఫిళ్లు(Rifles), నాలుగు ఏకే మ్యాగజైన్లు, పిస్టల్, పాకిస్థానీ(Pakistan) కరెన్సీ స్వాధీనపరచుకున్నారు. "కుప్వారా పోలీసులు అందించిన ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా, మచల్ సెక్టార్‌లోని కుంకడి ప్రాంతంలో ఆర్మీ, పోలీసులు జరిపిన జాయింట్ ఆపరేషన్‌లో, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు" అని కుప్వారా పోలీసులు ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపారు. డఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు.

Updated Date - 2023-09-30T16:31:28+05:30 IST