‘పుష్ప 2’ మూవీ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం

ABN , First Publish Date - 2023-05-31T09:02:13+05:30 IST

‘పుష్ప 2’ మూవీ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం చోటు చేసుకుంది. నార్కట్ పల్లి వద్ద ఆర్టీసీ బస్సును వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేస్తున్న పలువురు పుష్ప 2 మూవీ ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. షూటింగ్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంతో హైద్రాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ జాం అయింది.

‘పుష్ప 2’ మూవీ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం

నల్గొండ : ‘పుష్ప 2’ మూవీ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం చోటు చేసుకుంది. నార్కట్ పల్లి వద్ద ఆర్టీసీ బస్సును వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేస్తున్న పలువురు పుష్ప 2 మూవీ ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. షూటింగ్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంతో హైద్రాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ జాం అయింది.

చింతూరు మండలం మోతుగూడెంలో పుష్ప-2 షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్‌ చూడటానికి నాలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలం గాణ రాష్ట్రాల ప్రజలు వస్తున్నారు. కొందరు అధికారులు డైరెక్టర్‌ సుకుమార్‌, పుష్ప-2 విలన్‌ ఫాహద్‌ పాజిల్‌తో సెల్ఫీలు దిగారు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న పుష్ప-2 సినిమా చిత్రీకరణ మోతుగూడెం సరిహద్దు ఒడిశా రాష్ట్రంలోని ఎర్రబోరు అటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గ్రామాల యువతకు అవకాశం కల్పించారు. ఇప్పటికే 600 మంది యువకులు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నియంత్రించే సివిల్‌ సీఆర్పీఎఫ్‌ పోలీసులుగా, అటవీ శాఖ ఉద్యోగులుగా, ఎర్రచందనం దొంగలుగా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

Updated Date - 2023-05-31T09:02:13+05:30 IST