Home » Telangana
రేవంత్ రెడ్డి పాలన లాఠీ చార్జీలు, బడుగు జీవులకు జూటా మాటలులా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ను ఆయన పరామర్శించారు. రవీంద్ర కుమార్ తండ్రి కనిలాల్ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే రవీంద్రను పరామర్శించిన అనంతరం మీడియాతో హరీష్ రావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులపై లాఠీ చార్జి ఎప్పుడైనా చూశామా? అని ప్రశ్నించారు.
Telangana: తెలంగాణ ఈ-సెట్ (తెలంగాణ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి ఈ-సెట్ ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఈసెట్ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల 330 మంది విద్యార్థులు ఈ సెట్ రాయగా..
అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇల్లందు పట్టభద్రుల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందన్నారు. మార్పు కావాలని ఓటేసిన పాపానికి కాంగ్రెస్ వైఖరి జనాలకు అర్థమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా నిరుద్యోగులు, యువత దూరమయ్యారన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో ఎంపీ ఎన్నికలు ముగిసినందున బీజేపీ, కాంగ్రెస్ నేతలంతా ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ పార్టీ అధినేతల తరుఫున పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉత్తర భారత దేశంలోనే కాదు దక్షిణ భారత దేశంలోనూ ప్రధాని మోదీ వేవ్ కనిపిస్తోందన్నారు.
Telangana: రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వర్సిటీలకు రేపటితో (మంగళవారం) పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం వీసీల పంచాయితీ సెక్రటేరియట్కు చేరింది. పాత వైస్ చాన్సలర్లపై ఫిర్యాదులు, కొత్త వీసీ పోస్టుల కోసం బ్యాక్ డోర్ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా వీసీ పోస్టుల కోసం 1300కు పైగా దరఖాస్తులు వచ్చి చేరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఒక్కో వీసీపై రెండంకెల ఫిర్యాదులు నమోదు అయ్యాయి.
Telangana: రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలలోనే కుప్పకూల్చడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్రావు వ్యాఖ్యలు చేశారు. డయాగ్నస్టిక్ కేంద్రాల్లో వైద్యులు, సిబ్బందికి పెండింగ్ జీతాల చెల్లింపుపై హరీష్రావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..
Telangana: గ్రేటర్లో జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు సమ్మెకు దిగారు. సోమవారం ఉదయం నగరంలోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల వద్ద కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. కాంట్రాక్టుల మెరుపు సమ్మెతో నగర వ్యాప్తంగా ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు.
బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జీఆర్ ఫామ్హౌస్లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. జీఆర్ ఫామ్హౌస్ అనేది హైదరాబాద్కు చెందిన గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది.
ఇవాళ మధ్యాన్నం మూడు గంటలకు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ఈసీ నిబంధనలకు లోబడి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినేట్ భేటీ కానుంది. అత్యవసర అంశాలు మాత్రమే కేబీనెట్లో చర్చకు రానున్నాయి. ఉమ్మడి రాజధాని, రుణమాఫీలపై ఎలక్షన్ కమిషన్ చర్చ చేయొద్దని తెలిపింది. జూన్ 4లోపు చర్చించాల్సిన అంశాలే ఎజెండాగా కేబినెట్ సమావేశం జరుగనుంది.
Telangana: ‘‘గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి నా గెలుపు కోసం శ్రమించి పనిచేసి అద్భుతమైన మెజారిటీతో గెలిపించారు. మీ ఇంటి పెద్దకొడుకుగా మీ అందరి కోసం పనిచేస్తా’’ అని రెవిన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నేలకొండపల్లి మండలం గువ్వలగూడెంలో నిర్వహించిన ప్రజల వద్దకె శ్రీనన్న కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ..