Home » Telangana
Andhrapradesh: సంచలనం సృష్టించిన రెండున్నర కోట్ల నగదు దోపిడీ నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. కేవలం 12 గంటల్లోనే ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాఎస్పీ నరసింహ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ...హెచ్డీఎఫ్సీకి సంబంధించిన హిటాచీ ప్రైవేట్ సంస్థ ఉద్యోగులు అశోక్ కుమార్, రాజబాబు లు ప్రతీరోజు ఏటీఎంలలో నగదు నింపుతారని తెలిపారు.
Telangana: కాళేశ్వరంకు పోయిన వాళ్ళందరూ నాస్తికులే అని.. అందుకే గుడి యొక్క సాంప్రదాయాలను పాటించలేదని బీఆర్ఎస్ నేతలపై కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... గర్భగుడి లోపలికి వెళ్లేముందు ఎలా ఉండాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలీదా అని ప్రశ్నించారు. గర్భగుడిలోకి వెళ్లే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి వెళ్లాలని గుడి వద్ద బోర్డు ఉంటుందన్నారు.
Telangana: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్హాట్గా నడుస్తున్నాయి. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ మధ్య మాటల యుద్ధం నడిచింది. హరీష్రావు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. ప్రభుత్వం ప్రజల లక్ష్యంగా పని చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. ఆరు గ్యారంటీలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయింపులు పెంచారు.. కానీ అసలు బడ్జెట్లో కేటాయింపులు తగ్గించారని విమర్శించారు.
Telangana Budget 2024: అసెంబ్లీలలో తెలంగాణ రసవత్తర చర్చ నడిచింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు మొదలు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీల్లో జరిగిన అవకతవకలపై చర్చ హాట్ హాట్గా జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఒకవైపు.. సీఎం, మంత్రులు ఒకవైపు సవాళ్లు, ప్రతిసవాళ్లు, వివరణలతో సభ దద్దరిల్లింది.
Telangana Assembly Budget Session 2024: తెలంగాణ అసెంబ్లీ రసవత్తరంగా సాగుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడించింది. హాఫ్ నాలెడ్జ్తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నాడని హరీష్ రావు అంటే.. రివర్స్ కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు(Chilukur)లో 144 సెక్షన్ కొనసాగుతున్నది. చిలుకూరు రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్.134లో ఓ ప్రవాస భారతీయుడికి పట్టా భూమి ఉంది. దాని పక్కనే మరో సర్వే నంబర్ 133లో వక్ఫ్బోర్డు(Wakf Board)కు చెందిన పురాతన స్థలం, ఓ కట్టడం ఉంది.
అంబులెన్స్(Ambulance)ల ముసుగులో పలువురు డ్రైవర్లు రవాణా దందా సాగిస్తున్నారు. అత్యవసర రోగులకు వినియోగించాల్సిన వీటిని సాధారణ ప్రయాణికులకు వినియోగిస్తూ జేబులు నింపుకొంటున్నారు. అంతేకాకుండా ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా నిబంధనలను తుంగలో తొక్కుతూ.. సైరన్లను వినియోగిస్తూ రాంగ్రూట్లో వెళుతున్నారు.
పాతబస్తీలో ఆదివారం జరగనున్న లాల్దర్వాజా మహాకాళి(Laldarwaja Mahakali) బోనాల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు, నాయకులు, వీఐపీలు వచ్చే అవకాశముండటంతో తగిన ఏర్పాట్లు చేశారు. దక్షిణ మండల డీసీపీ స్నేహా మెహ్రా, ఏసీపీ చంద్రశేఖర్ ఏర్పాట్లను శుక్రవారం పర్యవేక్షించారు.
వాటర్బోర్డు(Waterboard)లో కొందరు అధికారులను బదిలీ చేసినా వెళ్లడం లేదు. తమ కుర్చీలను వదలడం లేదు. మేనేజర్లుగా, డిప్యూటీ మేనేజర్లుగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఎండీ ఉత్తర్వులు జారీ చేసినా వాళ్లు పట్టించుకోవడం లేదు. ఇక్కడికి బదిలీ అయినవారిని రానివ్వడం లేదు. రాజకీయ పలుకుబడితో అవసరమైతే ఉన్నతాధికారులపైనే ఒత్తిడి తీసుకొస్తున్నారు.
మాదాపూర్ దుర్గం చెరువులో దూకి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణమని తెలుస్తోంది.