లోకేష్ యువగళం పునఃప్రారంభం..
ABN, First Publish Date - 2023-11-27T09:16:48+05:30 IST
అమరావతి: టీడీపీ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం పొదలాడలో సోమవారం ఉదయం 10:19 నిముషాలకు ఆయన అడుగు ముందుకేస్తారు.
అమరావతి: టీడీపీ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం పొదలాడలో సోమవారం ఉదయం 10:19 నిముషాలకు ఆయన అడుగు ముందుకేస్తారు. చంద్రబాబు అక్రమ అరెస్టు నేపథ్యంలో లోకేష్ సెప్టెంబర్ 9న తన పాదయాత్రను నిలిపివేసిన సంగతి తెలిసిందే. తండ్రి జైల్లో ఉండడంతో.. పార్టీ సీనియర్ నేతలతో సమన్వయం, ఢిల్లీ, అమరావతిలో న్యాయవాదులతో సంప్రదింపుల్లో పాలుపంచుకున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated at - 2023-11-27T09:16:50+05:30