Share News

Ap Politics: సజ్జలపై క్రిమినల్‌ కేసు

ABN , Publish Date - Jun 01 , 2024 | 05:02 AM

కౌంటింగ్‌ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు.

Ap Politics: సజ్జలపై క్రిమినల్‌ కేసు

  • కౌంటింగ్‌ ఏజెంట్లను

  • రెచ్చగొట్టారంటూ టీడీపీ ఫిర్యాదు

  • తాడేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో నమోదు

తాడేపల్లి టౌన్‌, మే31: కౌంటింగ్‌ ఏజెంట్లను రెచ్చగొట్టే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అభియోగంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. నిబంధనలు పాటించే వారు కౌంటింగ్‌ ఏజెంట్లుగా అవసరం లేదని ఇటీవల సజ్జల చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమ, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఈ నెల 30న తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లి సీఐ కల్యాణ్‌రాజు... సజ్జల రామకృష్ణారెడ్డిపై ఐపీసీలోని 153, 505(2), 125 సెక్షన్లతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Updated Date - Jun 01 , 2024 | 05:02 AM