Home » YCP
మా పార్టీ అధికారంలోకి వస్తే మేము సేఫ్. లేదు లేదు గెలిచేది మా పార్టీనే. కాబట్టి మాకేం కాదు. ఇదీ పట్టణంలో జరిగిన రాళ్లదాడిలో పాల్గొని, అజ్ఞాతంలో ఉన్న ఇరుపార్టీల వారి ధీమా. సార్వత్రిక ఎన్నికల రోజున పట్టణంలోని ఓంశాంతినగర్, పాతకోట ప్రాంతాల్లో రాళ్లదాడులు జరిగిన 24గంటల్లోనే మరోసారి వైసీపీ శ్రేణులు పట్టణంలోని గానుగవీధిలోని టీడీపీ సీనియర్ నాయకుడు సూర్యముని ఇంటి సమీపంలో రాళ్లవర్షం కురిపించారు. అయితే ఈ ఘటనలకు ఎలాంటి సంబంధం లేని ఇరువర్గాల వారిని కూడా పోలీసు ఉన్నతాధికారులు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. దీంతో ఇప్పటికే ద్వితీయశ్రేణి ...
ఇటీవల ముగిసిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం. అయినా మహిళా ఓటర్ల కన్నా పురుషులు అధికంగా ఓటింగ్లో పాల్గొన్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో పురుష ఓటర్లు 9,97,792 మంది ఉండగా, మహిళా ఓటర్లు 10,20,124మంది ఉన్నారు. ఇందులో పురుషుల ఓటర్లు 8,37,451మంది, మహిళా ఓటర్లు 8,18,996 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో రాయదుర్గం, ...
కృష్ణాజిల్లా, గుడివాడ: ఓటర్లకు డబ్బులు పంచకుండా కొందరు కాజేశారంటూ గుడివాడ సీనియర్ వైసీపీ మైనార్టీ నేత సర్దార్ బేగ్ ఆరోపణలు చేశారు. డబ్బు కాజేసిన వారిపై పెంపుడు కుక్కలు వదలాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసు చరిత్రలోనే కొత్త అధ్యాయం నమోదైంది. ఎన్నికల విధుల్లో వైఫల్యంపై విచారణకు రాష్ట్ర పోలీస్ శాఖ ఊహించని రీతిలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటైంది.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ నెల 13న తెనాలిలో తనను కొట్టిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
విశాఖ: వైసీపీ గూండాలకు రోజులు దగ్గర పడ్డాయని, కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసిన వారిపై దాడులు చేస్తారా? ఫ్యామిలీ ఇష్యూ అంటూ పోలీసులు కేసును డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విశాఖ ఉత్తర నియోజక వర్గం కూటమి అభ్యర్ధి విష్టుకుమార్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: రాష్ట్రంలో పోలింగ్ అనంతరం వైసీపీ రౌడీల దాడులపై తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులను కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారని విమర్శించారు. చివరికి ప్రశాంతమైన విశాఖలో కూడా వైసీపీ మూకలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.
పేదల పక్షపాతినని చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్ నిజస్వరూపం బయటపడింది. ఎన్నికలు పూర్తయినందున ప్రస్తుతం పేదల అవసరం లేదనుకున్నారేమో... వారిని పక్కనబెట్టి అస్మదీయులైన కాంట్రాక్టర్లకు మేళ్లు చేస్తున్నారు. ఎప్పుడో బటన్ నొక్కిన సంక్షేమ పథకాల లబ్ధిదారులందరికీ నగదు జమ చేయకుండా అరకొర
తాడిపత్రి అల్లర్లను అరికట్టడంలో విఫలమైనందుకు ఎస్పీ అమిత బర్దర్పై సస్పెన్షన వేటు పడింది. తాడిపత్రి నియోజకవర్గ కేంద్రంలో పోలింగ్ రోజు, ఆ తరువాత జరిగిన హింసాత్మక చర్యలను అరికట్టడంలో విఫలమైనందుకు ఎన్నికల కమిషన చర్యలు తీసుకుంది. ఆయనతోపాటు తాడిపత్రి డీఎస్పీ సీఎం గంగయ్య, సీఐ ఎస్.మురళీకృష్ణను సస్పెండ్ చేసింది. తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ వర్గీయులు ...
వైసీపీ అభ్యర్థుల్లో రోజురోజుకూ అభద్రతాభావం పెరిగిపోతోంది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు ముందు ఉన్న జోష్ వారిలో కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అనే గుబులు పట్టుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అభ్యర్థుల గెలుపుపై పందెం కాసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. పోలింగ్ శాతం పెరగడం... యువత ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనడం వైసీపీ అభ్యర్థులను, శ్రేణులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ప్రభుత్వంపై ఉద్యోగవర్గాల్లో ఉన్న వ్యతిరేకత, అధికారంలో ఉన్నామనే దర్పంతో ఎమ్మెల్యేలు సాగించిన అక్రమాలు...