Share News

కురబలకోట జడ్పీహైస్కూల్‌ నిధుల స్వాహాపై విచారణ

ABN , Publish Date - Aug 28 , 2024 | 11:48 PM

మండలంలోని కురబలకోట జడ్పీహైస్కూల్‌లో నాబార్డు నిధులతో జరిగిన పనులలో నిధుల స్వాహాపై ఉపవిద్యాధికారి పురుషోత్తం బుధవారం విచారణ చేపట్టారు.

కురబలకోట జడ్పీహైస్కూల్‌ నిధుల స్వాహాపై విచారణ
జడ్పీహైస్కూల్‌లో నిధుల స్వాహాపై విచారణ చేస్తున్న ఉపవిద్యాధికారి

కురబలకోట, ఆగస్టు 28: మండలంలోని కురబలకోట జడ్పీహైస్కూల్‌లో నాబార్డు నిధులతో జరిగిన పనులలో నిధుల స్వాహాపై ఉపవిద్యాధికారి పురుషోత్తం బుధవారం విచారణ చేపట్టారు. కాగా హైస్కూల్‌లో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనుల్లో అవినీతి జరిగిందని విద్యా కమిటీ చైర్మన రఫీ, టీడీపీ నేతలు రాఘవ రెడ్డి, రెడ్డిశేఖర్‌, శ్రీనివాసులు డీఈవోకు ఫిర్యా దు చేశారు. దీనిపై స్పందించిన డీఈవో విచారణ చేపట్టాలని డీవైఈవోను ఆదేశించడంతో విచారణ చేపట్టిన ఆయన మరుగుదొడ్లు, అసంపూర్తి నిర్మాణాలను పరిశీలించి జరిగిన నిర్మాణాల కన్నా రూ.లక్షలు ఆదనంగా డ్రా చేసినట్లు విచారణలో వెలుగుచూసింది. దీనిపై నివేదికను డీఈవోకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈవిచారణలో ఎంఈవో ధ్వారక నాధ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 11:48 PM