Share News

క్రికెట్‌ టోర్నీలో డీపాల్‌, మాంటిస్సోరి జట్ల విజయం

ABN , Publish Date - Jul 20 , 2024 | 11:54 PM

స్కూల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ బాలికల విభాగంలో సెయింట్‌ విన్సెంట్‌ డీ పాల్‌, బాలురలో మాంటిస్సోరి స్కూల్‌ జట్లు విజేతలుగా నిలిచాయి. శనివారం స్థానిక అనంత క్రీడాగ్రామం ఆర్డీటీ స్టేడియంలో ఆర్డీటీ జిల్లాస్థాయి స్కూల్‌ క్రికెట్‌ టోర్నీ ఫైనల్‌ పోటీలు నిర్వహించారు.

క్రికెట్‌ టోర్నీలో డీపాల్‌, మాంటిస్సోరి జట్ల విజయం
A view of St. DePaul School presenting the cup to the girls' team

అనంతపురం క్లాక్‌టవర్‌, జూలై 20: స్కూల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ బాలికల విభాగంలో సెయింట్‌ విన్సెంట్‌ డీ పాల్‌, బాలురలో మాంటిస్సోరి స్కూల్‌ జట్లు విజేతలుగా నిలిచాయి. శనివారం స్థానిక అనంత క్రీడాగ్రామం ఆర్డీటీ స్టేడియంలో ఆర్డీటీ జిల్లాస్థాయి స్కూల్‌ క్రికెట్‌ టోర్నీ ఫైనల్‌ పోటీలు నిర్వహించారు. బాలికల విభాగంలో నిర్వహించిన ఫైనల్‌లో సెయింట్‌ విన్సెంట్‌ డీపాల్‌, రాప్తాడు ఏపీ మోడల్‌స్కూల్‌ జట్లు తలపడగా డీపాల్‌ జట్టు 12 ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 120పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన మోడల్‌ స్కూల్‌ 12ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 44పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. బాలుర మ్యాచలో మాంటిస్సోరి స్కూల్‌, ఆర్డీటీ ప్రత్యేక హైస్కూల్‌ జట్లు పోరులో మాంటిస్సోరి 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. అనంతరం ఆర్డీటీ స్పెషల్‌ స్కూల్‌ 14.4 ఓవర్లలో 87పరుగులు మాత్రమే చేసి ఆలౌట్‌ అయ్యింది. బాలికల్లో విజేతగా సెయింట్‌ విన్సెంట్‌ డీపాల్‌, రన్నర్‌గా రాప్తాడు మోడల్‌ స్కూల్‌ నిలవగా, బాలుర విభాగంలో విజేతగా మాంటిస్సోరి, రన్నర్‌గా ఆర్డీటీ స్పెషల్‌ హైస్కూల్‌ జట్లు నిలిచాయి. జిల్లా క్రికెట్‌ సంఘం కార్యదర్శి మధు ఆచారి చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్డీటీ స్కూల్‌ డైరెక్టర్‌ రామ్‌కమల్‌, క్రికెట్‌ కోఆర్డినేటర్‌ యుగంధర్‌రెడ్డి, కోచలు గాంధీ, కుమార్‌, ప్రవీణ్‌, మధుసూదన నాయక్‌, పీఈటీలు నరేష్‌, నారాయణరెడ్డి, శేఖర్‌, శంకర్‌, మల్లికార్జున పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2024 | 11:54 PM