Home » Andhra Pradesh » Ananthapuram
మండలకేంద్రంలో గం గా భవానీ అమ్మవారి ఆల య 16వార్షికోత్సవ వేడుక ల సందర్భంగా గత మూడు రోజుల నుంచి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున అర్చకులు ఆలయం లో అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు చేశారు. మహిళలు పెద్దఎత్తున జ్యోతులు, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
కొత్తచెరువు మేజర్ గ్రామ పంచాయతీలో చెత్తను తరలించే ట్రైసైకిళ్లు మూలన పడి తుప్పు పడుతున్నాయి. మూడేళ్ల క్రితం ప్రభుత్వం పంచాయతీలోని వార్డులలో చెత్తను సేకరించి సంపద తయారీ కేంద్రాలకు తరలించేందుకు వీటిని పంచాయతీ కార్మికులకు అందజేసింది.
స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ఉద్యమకారుడు పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని పట్టణంలోని సాయికృప జూ నియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు.
చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల ఐదోరోజు ఆదివారం స్వామివారు పుష్పమండపంపై విహరించారు. శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీచెన్నకేశవ స్వామి ఉత్సవ విగ్రహాలను ఉదయం ప్రత్యేకంగా అలంకరించి, పుష్పమండపంపై కొలువుదీర్చారు.
రానున్న విద్యాసంవత్సరానికి పదవ తరగతి సిలబస్ మారింది. కొత్త పాఠ్య పుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. 2024-25 విద్యాఏడాదికి సంబంధించిన అన్ని తరగతుల పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుతున్నాయి.
పట్టణంలోని ప్రధాన రహదారిపై స్టేట్ బ్యాంక్ వద్ద ఆదివారం కర్ణాటక పోలీసులు ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకోడంతో పాటు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మఫ్టీ దుస్తుల్లో, ఎర్రరంగుకారులో వచ్చిన కర్ణాటక పోలీసులు గోరంట్లలోని బ్యాంక్ వద్ద నెంబర్ ప్లేట్లు లేని ఆటో, డియో స్కూటీని దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
ముఖ్యమంత్రి బటన నొక్కి దాదాపు మూడు నెలలు కావస్తున్నా జగనన్న విద్యాదీవెన సొమ్ము అందక పలువురు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న మూడు ట్రా క్టర్లను సీజ్ చేసినట్టు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఆదివారం సోమందేపల్లి మండలం చల్లాపల్లి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.
భారతదేశ కమ్యూ నిస్టు ఉద్యమ నేత, పార్లమెంట్లో మొట్ట మొదటి ప్రతి పక్షనేత పుచ్చలపల్లి సుంద రయ్య 39వ వర్ధంతి సందర్భంగా స్థానిక మల్లు స్వరాజ్యం నగర్లో ఆయన చిత్రపటానికి పలువు రు ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పిం చారు.
మండల కేంద్రంలో ప్రతివారం జరిగే పశువుల సంతలో సుంకం సొమ్ముతో కొంతమంది దళారులు జేబులు నింపుకుంటున్నారనే విమర్శ లు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. గుడిబండ పశువుల సంతను గురు, శుక్రవారాల్లో నిర్వహిస్తున్నారు. ఈ పశువుల సంత సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను సుంకం వేలం గడువు ఈ సంవత్సరం మార్చి 31 తేదీ నాటికి ముగిసిపోయింది. దీంతో అధికారులు 2024- 25 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ సంవత్సరం ఫిబ్రవరి 22న పంచాయతీ అధికా రులు వేలం వేశారు.