Share News

BSP: హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి

ABN , Publish Date - Jun 13 , 2024 | 11:10 PM

హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీరాములు, కొల్లకుంట నాగరాజు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక ఆబాద్‌పేటలోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

BSP: హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలి
BSP leaders shouting slogans

హిందూపురం అర్బన, జూన 13: హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీరాములు, కొల్లకుంట నాగరాజు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక ఆబాద్‌పేటలోని బీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఎమ్మల్యేగా గెలుపొందినప్పటికీ వైసీపీ అధికారంలో ఉండటంతో అప్పట్లో పలుమార్లు నిర్వహించిన ధర్నాలు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారన్నారు. అప్పట్లో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని, మెడికల్‌ కళాశాలను పురంలోనే ఏర్పాటు చేయాలని అఖిలపక్షాలతో కలిసి నిరసనలో పాల్గొని మాట్లాడారన్నారు. ప్రసు తం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని బాలయ్య హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా మార్చేందుకు కృషి చేయాలని వారు కోరారు. బీఎస్పీ నాయకులు హరికుమార్‌, శిరివరం మూర్తి, ఎంఎల్‌ నారాయణ, మౌలాలి, ఖలందర్‌, బాబు, చిరంజీవి, నరసింహప్ప, సత్తెప్ప, అంజినప్ప, వెంకటరాముడు, గంగాధరప్ప పాల్గొన్నారు.

Updated Date - Jun 13 , 2024 | 11:10 PM