Share News

MRPS: ఆత్మగౌరవ కవాతును విజయవంతం చేయండి

ABN , Publish Date - Jun 23 , 2024 | 11:52 PM

తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో జూలై 7న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించే మాదిగల ఆత్మగౌరవ కవాతును విజయవంతం చేయాలని ఎంఈఎఫ్‌ అదనపు ప్రదానకార్యదర్శి బండారు శంకర్‌ పిలుపు నిచ్చారు.

MRPS: ఆత్మగౌరవ కవాతును విజయవంతం చేయండి
MMPS leaders speaking

ధర్మవరం, జూన 23: తెలంగాణ రాష్ట్రం వరంగల్‌లో జూలై 7న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించే మాదిగల ఆత్మగౌరవ కవాతును విజయవంతం చేయాలని ఎంఈఎఫ్‌ అదనపు ప్రదానకార్యదర్శి బండారు శంకర్‌ పిలుపు నిచ్చారు. చలో వరంగల్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ధర్మవారానికి ఆయన వచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ జరిగితేనే మాదిగల జీవితాల్లో మార్పువస్తుందని, మాదిగలకు విద్య, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. ఎమ్మార్పీఎస్‌ నాయకులు కేశగాళ్ల శ్రీనివాసులు, ఎంఈఎఫ్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ సాకే మధుసూదన, ఎంఈఎఫ్‌ నేతలు కొండప్ప, కొడవండ్ల నారాయణస్వామి, వెంకటేశ, లక్ష్మీనారాయణ, శేషు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2024 | 11:52 PM