Share News

DMHO: మెరుగైన వైద్యం అందించండి

ABN , Publish Date - Jun 28 , 2024 | 12:02 AM

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి మంజులవాణి సిబ్బందికి సూచించారు. సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని గురువారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు.

DMHO: మెరుగైన వైద్యం అందించండి
Manjulawani, the district medical officer instructing the doctors

హిందూపురం(సోమందేపల్లి), జూన 27: రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి మంజులవాణి సిబ్బందికి సూచించారు. సోమందేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని గురువారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. డయేరియా, వ్యాక్సినేషన, సీజనల్‌ వ్యాధులు కోసం చేపడుతున్న చర్యలపై ఆరాతీశారు. సిబ్బంది తమ పనితీరును మెరుగు పరుచుకోవాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వైద్యాధికారి హరికుమార్‌, ఓంకార్‌, సీహెచఓ మనోహర్‌రెడ్డి, సూపర్‌వైజర్‌ అనీల్‌, ఫార్మసిస్ట్‌ ప్రబాకర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ మధుబాబు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2024 | 12:02 AM