bjp: సత్యకుమార్ ముమ్మర ప్రచారం
ABN , Publish Date - May 09 , 2024 | 12:15 AM
మండల కేం ద్రంలోని చర్చి వీధి, చెలిమిబావి వీధి, టీచర్స్ కాలనీ, ఎస్టీ కాలనీ, వడ్డిపేట, దొరిగల్లు రోడ్డు, ఆర్అండ్బీ బంగ్లా వీధి, సాయినగర్లలో బుధవారం కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు.
ముదిగుబ్బ, మే8: మండల కేం ద్రంలోని చర్చి వీధి, చెలిమిబావి వీధి, టీచర్స్ కాలనీ, ఎస్టీ కాలనీ, వడ్డిపేట, దొరిగల్లు రోడ్డు, ఆర్అండ్బీ బంగ్లా వీధి, సాయినగర్లలో బుధవారం కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు. తొలుత స్థానిక నాయకలు గజమాలలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఇంటింటికీ తిరిగి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, సీసీరోడ్లు, డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు తెలిపారు. దీంతో ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి రాగానే వాటిని వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు .
కమలం గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, సైకిల్ గుర్తుకు ఓటు వేసి బీకే పార్థసారధిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి రాగానే మండల కేంద్రంలోని ఈద్గా, కబరస్థాన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అలాగే మండలంలో చుక్కల భూముల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కబ్జాలకు గురైన భుములపై విచారణ చేయిస్తామన్నారు. 30 పడకల ఆసుపత్రిని, మహిళా డిగ్రీ కళాశాలను తీసుకొస్తామని, హిందువులకు శ్మశానవాటికను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్థానికంగా ఉన్న 20 కుటుంబాలవారు సత్యకుమార్ ఆధ్వర్యంలో బీజేపీలోకి చేరారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....