Share News

CRICKET ; యూటీఎఫ్‌ క్రికెట్‌ పోటీల్లో విజేతలు

ABN , Publish Date - Jul 21 , 2024 | 11:58 PM

స్థానిక ప్రభుత్వ ఉన్నత క్రీడా మైదానంలో ఆదివారం జరిగిన యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ జిల్లాస్థాయి క్రికెట్‌ పోటీలలో రొద్దం, మడకశిర, ఎనపీకుంట జట్లు విజయం సాధించాయి. మొదట జరిగిన రొద్దం-అమరాపురం జట్ల మ్యాచలో రొద్దం జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రొద్దం జట్టు 12ఓవర్లలో 154పరు గులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన అమరాపురం జట్టు 54పరు గులకు ఆలౌట్‌ అయింది.

CRICKET ; యూటీఎఫ్‌ క్రికెట్‌  పోటీల్లో విజేతలు
UTF leaders giving prizes to the winners

పెనుకొండ, జూలై 21 : స్థానిక ప్రభుత్వ ఉన్నత క్రీడా మైదానంలో ఆదివారం జరిగిన యూటీఎఫ్‌ స్వర్ణోత్సవ జిల్లాస్థాయి క్రికెట్‌ పోటీలలో రొద్దం, మడకశిర, ఎనపీకుంట జట్లు విజయం సాధించాయి. మొదట జరిగిన రొద్దం-అమరాపురం జట్ల మ్యాచలో రొద్దం జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన రొద్దం జట్టు 12ఓవర్లలో 154పరు గులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన అమరాపురం జట్టు 54పరు గులకు ఆలౌట్‌ అయింది. మ్యానఆఫ్‌ది మ్యాచగా రామాంజనేయులును ఎంపిక చేశారు. అనంతరం రెండో మ్యాచ కదిరి, మడకశిర జట్ల మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న మడకశిర జట్టు 12ఓవర్లలో 104పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన కదిరిజట్టు 86పరుగులకు ఆలౌట్‌ అయింది. మ్యానఆఫ్‌ది మ్యాచగా మడకశిర క్రీడాకారుడు మంజు నిలిచాడు. అనంత రం మూడో మ్యాచ గుడిబండ, ఎనపీ కుంట జట్ల మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్‌ చేసిన గుడిబండ జట్టు 103పరుగులు చేయగా ఎనపీ కుంట జట్టు 7వికెట్లతో విజయం సాధిం చింది. యోగి మ్యానఆఫ్‌ది మ్యాచగా ఎంపికయ్యాడు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌, జిల్లా కార్యదర్శులు నరేష్‌కుమార్‌, తహర్‌వలి, ఆజాంవలి, గంగాధర్‌, శివయ్య, ఆది, జినేష్‌, మారుతి, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 21 , 2024 | 11:58 PM