Share News

అల్లూరి స్ఫూర్తితో పురోగమించాలి: చంద్రబాబు

ABN , Publish Date - Jul 05 , 2024 | 05:09 AM

విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ‘

అల్లూరి స్ఫూర్తితో పురోగమించాలి: చంద్రబాబు

అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ‘భారత స్వాతంత్య్ర సంగ్రామంలో మహాజ్వల శక్తిగా వెలుగొందిన అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. గిరిజన, తాడిత పీడిత ప్రజలను స్వాతంత్య్ర సంగ్రామానికి సమాయత్తం చేసిన ఆ మహనీయుడి స్పూర్తితో మనం పురోగమించాల్సిన అవసరం ఇప్పటికే ఉంది. సమసమాజ స్థాపనకు అల్లూరి సీతారామరాజు చూపిన బాట మనకు ఆదర్శప్రాయం’ అని చంద్రబాబునాయుడు ట్వీట్‌ చేశారు.

టీడీపీ కార్యాలయంలో....

మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో గురువారం అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా వేడుకలు నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కోఆర్డినేటర్స్‌ బుచ్చి రాంప్రసాద్‌, రాజశేఖర్‌, టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌ దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 05:11 AM