Home » TDP
రాష్ట్రంలో పోలింగ్ రోజు(ఈ నెల 13న).. (AP Elections) ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలను రాష్ట్ర పోలీసు యంత్రాంగం చాలా తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు..
మా పార్టీ అధికారంలోకి వస్తే మేము సేఫ్. లేదు లేదు గెలిచేది మా పార్టీనే. కాబట్టి మాకేం కాదు. ఇదీ పట్టణంలో జరిగిన రాళ్లదాడిలో పాల్గొని, అజ్ఞాతంలో ఉన్న ఇరుపార్టీల వారి ధీమా. సార్వత్రిక ఎన్నికల రోజున పట్టణంలోని ఓంశాంతినగర్, పాతకోట ప్రాంతాల్లో రాళ్లదాడులు జరిగిన 24గంటల్లోనే మరోసారి వైసీపీ శ్రేణులు పట్టణంలోని గానుగవీధిలోని టీడీపీ సీనియర్ నాయకుడు సూర్యముని ఇంటి సమీపంలో రాళ్లవర్షం కురిపించారు. అయితే ఈ ఘటనలకు ఎలాంటి సంబంధం లేని ఇరువర్గాల వారిని కూడా పోలీసు ఉన్నతాధికారులు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. దీంతో ఇప్పటికే ద్వితీయశ్రేణి ...
ఇటీవల ముగిసిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకంటే పురుషులే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం. అయినా మహిళా ఓటర్ల కన్నా పురుషులు అధికంగా ఓటింగ్లో పాల్గొన్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో పురుష ఓటర్లు 9,97,792 మంది ఉండగా, మహిళా ఓటర్లు 10,20,124మంది ఉన్నారు. ఇందులో పురుషుల ఓటర్లు 8,37,451మంది, మహిళా ఓటర్లు 8,18,996 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో రాయదుర్గం, ...
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసి వారం రోజులు కావొస్తుంది. ఫలితాల కోసం మరో 15 రోజులు ఆగాల్సిందే. ఈలోపు గెలుపుపై ఎవరి అంచనాలు వారివి. మరోవైపు పందేం రాయుళ్ల హడావుడి. నియోజకవర్గాలవారీ ఇప్పటికే కోట్లలో పందేలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై ఇప్పటికే వందల కోట్ల రూపాయిలు పందేలు కట్టినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజు వరకు వైసీపీకి చెందిన నేతలు పందేలు కట్టేందుకు భారీగా ముందుకు రాగా.. ప్రస్తుతం సర్వే సంస్థల నుంచి వచ్చిన సమాచారం, గ్రామాల వారీ క్యాడర్ అందిస్తున్న వివరాలతో వైసీపీ నేతలు పందేలు కట్టడంలో కొంచెం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన పామర్రులో అధికారం మాదంటే మాదేనంటూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కులమతాలకు అతీతంగా పేదలకు అందించిన పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలతో వైసీపీ అభ్యర్థి రెండోసారి గెలుపొందటం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ప్రగాల్భాలు పలుకుతుండగా, వారికి దీటుగా ఎన్టీయే కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాలు గత ఐదేళ్ల వైసీపీ పాలనతో ..
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి కూడా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ పోలీసు చరిత్రలోనే కొత్త అధ్యాయం నమోదైంది. ఎన్నికల విధుల్లో వైఫల్యంపై విచారణకు రాష్ట్ర పోలీస్ శాఖ ఊహించని రీతిలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటైంది.
గొడవలు జరిగితే ఎక్కడైనా ప్రత్యర్థులు దాడి చేస్తారు. కొందరు చంపేయాలని చూస్తారు. కానీ తాడిపత్రిలో అందుకు భిన్నంగా జరిగింది. శాంతిభద్రతలను కాపాడే పేరిట అక్కడికి వెళ్లిన పోలీసులు.. ఏవో వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ దాసరి కిరణ్ను చితకబాదాలని పోలీసులను డీఎస్పీ చైతన్య పురమాయించడం విస్తుగొలుపుతోంది. ఆ తరువాత
Andhrapradesh: ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి కట్టడి చేయాలని ఆదేశించందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్జీటీ ఆదేశించినా ఇసుక తవ్వకాలు ఆగడం లేదని విమర్శించారు. ఇసుకను దోచుకుని తాడేపల్లి ప్యాలెస్కు రూ. 40 వేల కోట్లు తరలిస్తున్నారని ఆరోపించారు.
Andhrapradesh: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ క్యాబినేట్లో ఉన్న 40 మంత్రలు ఓడిపోతున్నారని.. వైసీపీకి ఘోర పరాజయం తప్పదని అన్నారు. జగన్ రెడ్డి మాటల్లో ఓటమి భయం స్పష్టమైందన్నారు. వైసీపీ కార్యకర్తలను, ప్రజలను మభ్యపెట్టేందుకు మళ్లీ సజ్జల యత్నిస్తున్నారని మండిపడ్డారు.