Share News

Chandrababu: 3 పార్టీల సింహగర్జన ఇది.. జగన్ నీ ఓటమి పక్కా.. రాసుకో: చంద్రబాబు

ABN , Publish Date - Apr 10 , 2024 | 10:06 PM

నిడదవోలు సాక్షిగా మూడు పార్టీల అధినేతలు ఒక్కటయ్యారని.. ఇది 3 పార్టీల సింహ గర్జన అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) అన్నారు.

Chandrababu: 3 పార్టీల సింహగర్జన ఇది.. జగన్ నీ ఓటమి పక్కా.. రాసుకో: చంద్రబాబు

తూగో: నిడదవోలు సాక్షిగా మూడు పార్టీల అధినేతలు ఒక్కటయ్యారని.. ఇది 3 పార్టీల సింహ గర్జన అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu) అన్నారు. బుధవారం ఆయన నిడదవోలు సభలో మాట్లాడుతూ.. సీఎం జగన్‌కి(CM Jagan) రానున్న ఎన్నికల్లో పరాభవం తప్పదని స్పష్టం చేశారు. నిడదవోలు సభ భారీ సక్సెస్ సాధించిందని.. ఈ సభతో జగన్‌కు నిద్రపట్టదు అని అన్నారు. "జగన్ సిద్ధం సిద్ధం అంటూ ఎక్కడో తిరుగుతున్నారు.

ఆయన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధమయ్యారు. కూటమి కాంబినేషన్ సూపర్ హిట్ అవుతుంది. మడమ తిప్ఫని నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్ని ఆటుపోట్లు సృష్టించినా గట్టిగా నిలబడిన నాయకుడు. జగన్ చేసిన అప్ఫులకు, విధ్వంసానికి రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది. రాష్ట్రంలో గాడి తప్పిన పాలనను దారిలో పెట్టే శక్తి, ఎన్డీఏకు ఉంది. జగన్ గొడ్డలి వేటుకు బలి కానివారు ఎవరూ లేరు. జాబ్ రావాలంటే కూటమి గెలవాలి.

జగన్ సింగిల్ గా రావడం లేదు. శవాలతో వస్తున్నారు. జగన్ పాలన నచ్చక వైసీపీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేసి, మా దగ్గరకు వస్తున్నారు. జగన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు. ఇంకా మెరుగైన రీతిలో అమలుచేస్తాం" అని బాబు అన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 10 , 2024 | 10:07 PM