Home » AP Politics
చాలా సందర్భాల్లో రాజకీయ పార్టీలు ప్రజల దృష్టిని ఆకర్షించడం కోసం సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటాయి. కొన్ని సందర్భాల్లో సంచలనమైన అంశాలను వెలుగులోకి తీసుకొస్తాయి. మరికొన్నిసార్లు ఊహించినంత సంచలనం ఉండకపోవచ్చు. గతంలో తెలుగురాష్ట్రాల్లో ఇలాంటి సవాళ్ల పర్వాన్ని చూసిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం తెలుగుదేశం, వైసీపీ చేసిన ట్వీట్లపై మాత్రం తీవ్ర ఆసక్తి నెలకొంది. టీడీపీ ప్రభుత్వంలో..
వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో 16 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో.. మనస్థాపానికి గురైన ఆమె మహిళ కమిషన్ ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి వైసీపీలో ఉన్నప్పటికీ యాక్టివ్గా కనిపించడంలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత పెద్దగా ఆమె వాయిస్ వినిపించడంలేదు. మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా ఉన్న సమయంలోనూ, అంతకుముందు వైసీపీ తరపున తన గొంతును వినిపించిన వాసిరెడ్డి పద్మ కొంతకాలంగా..
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేటలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. చెలగల కాటయ్య అనే టీడీపీ కార్యకర్త ఇంటిపై వైసీపీకి చెందిన దుంపల మధు, అతని అనుచరులు దాడి చేశారు.
వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయం సహా సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu) నివాసంపై జరిగిన దాడి కేసులో నిందితులుగా ఉన్న అవినాశ్, జోగి రమేశ్ విచారణకు సహకరించట్లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిన్న (శనివారం) సాయంత్రం తన స్వగృహంలో మండలాల వారీ సమావేశాలు చేపట్టారు.
మద్యం, ఇసుక దోపీడీ జరుగుతోందంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) విమర్శించారు.
నగరంలో రౌడీ మూకలు రెచ్చిపోయారు. కడప నగర టీడీపీ అధ్యక్షుడు శివకొండారెడ్డిపై గుర్తుతెలియని దుండగలు దాడికి తెగబడ్డారు. నగరంలో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుపై వెళ్తున్న శివకొండారెడ్డిపై దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు.
తప్పు చేసిన వారిని చట్టబద్దంగా శిక్షిద్దామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇష్టం వచ్చినట్లు అరెస్టులు జరగాలి అంటే కుదరదని తేల్చిచెప్పారు. అది తనవిధానం కాదని... తాను చెడ్డపేరు తెచ్చుకునేందుకు మాత్రం సిద్ధంగా లేనని చెప్పారు. ఇసుక విషయంలో ఎవరు వేలు పెట్టవద్దని నేతలను హెచ్చరించారు....ఇసుక విషయంలో తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించవద్దని అధికారులకు స్పష్టంగా చెప్పానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. నూతనంగా ఏపీలో మద్యం, ఇసుక విధానాలు తీసుకువచ్చారని, వాటిలో అంతా అవినీతేనని జగన్ ఆరోపించారు.