Home » AP Politics
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై (MLA Rachamallu Sivaprasad Reddy) పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు ఒన్ టౌన్ సీఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్ రెడ్డి బావమరిది బంగారు మునిరెడ్డిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐను బెదిరించి, విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.
వైసీపీ (YSRCP) ప్రభుత్వం వల్ల ఉద్యోగ సంఘాలు చాలా నష్టపోయాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘం ఐక్యవేదిక సంఘాల రాష్ట్ర చైర్మన్ కె.ఆర్ సూర్యనారాయణ (KR Suryanarayana) అన్నారు. ఉద్యోగుల జీపీఎస్ సొమ్మును తమకు తెలియకుండా తమ ఖాతాల నుంచి రూ. 500 కోట్లను వైసీపీ ప్రభుత్వం దొంగతనం చేసిందని ఆరోపించారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలు (AP Elections 2024) ముగిసిన అనంతరం జరిగిన అల్లర్లపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) దర్యాప్తును ముమ్మరం చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చెలరేగిన హింసపై సిట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఈ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
సీఎం, వైఎస్సార్పీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (CM JAGAN) మేనమామ, వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి (Ravindranath Reddy) నోరు జారారు. ఆదివారం ఆయన తిరుపతిలోని వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైసీపీ అని నోరుజారారు.
ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన పామర్రులో అధికారం మాదంటే మాదేనంటూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కులమతాలకు అతీతంగా పేదలకు అందించిన పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలతో వైసీపీ అభ్యర్థి రెండోసారి గెలుపొందటం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ప్రగాల్భాలు పలుకుతుండగా, వారికి దీటుగా ఎన్టీయే కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాలు గత ఐదేళ్ల వైసీపీ పాలనతో ..
సార్వత్రిక ఎన్నికల తరువాత అల్లర్లు చెలరేగడం, మరికొన్ని రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు.
సుప్రీంకోర్టులో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు (YS Sharmila) ఊరట లభించింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడవద్దన్న కడప కోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. షర్మిల వేసిన పిటీషన్పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసిన తర్వాత పలు జిల్లాల్లో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలపై ఎన్నికల కమిషన్ (Election Commission) సీరియస్ అయింది. ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ప్రశ్నించింది.
నిన్న ఎయిర్ పోర్ట్లో అన్యాయంగా ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేష్ను అరెస్టు చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమ (Devineni UMA) అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై లోకేష్ అభిప్రాయాలు వ్యక్తం చేయడం తప్పా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అవినీతిపై లోకేష్ తన అభిప్రాయాలు చెప్పారని అన్నారు.
పేదింటి బిడ్డ సీఎం జగన్ తన కుటుంబంతో కలసి విమానంలో లండన్కు విహార యాత్రకు వెళ్లారు.