Share News

ఎన్‌డీబీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం

ABN , Publish Date - Jul 27 , 2024 | 03:21 AM

అమరావతి అభివృద్ధి కోసం న్యూ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకొచ్చింది.

ఎన్‌డీబీ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం

అమరావతి, జూలై 26(ఆంధ్రజ్యోతి): అమరావతి అభివృద్ధి కోసం న్యూ డెవల్‌పమెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. ఎన్‌డీబీ డైరెక్టర్‌ జనరల్‌ డీజే పాండియన్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి పలు కీలకమైన అంశాల్లో చేయూతనందిస్తామని తెలిపారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి మౌలిక వసతుల కల్పన, ముఖ్యంగా గ్రామీణ రోడ్ల కనెక్టివిటీ, మేజర్‌ ప్రాజెక్టులైన పోర్టులు, గ్రీన్‌ ఎనర్జీ తదితర వాటికి సహకారమందిస్తామని సీఎంకు తెలిపారు.

Updated Date - Jul 27 , 2024 | 07:05 AM