Share News

అవినీతి సొమ్ముకు ఆశపడలేదు

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:05 AM

‘మేము ఏనాడూ అవినీతి సొమ్ముకు ఆశపడలేదు. అవినీతి సొమ్ము ఎంత సంపాదించినా పాపాలను మూటగట్టుకోవడం తప్ప అది చేతిలో నిలవదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గ

అవినీతి సొమ్ముకు ఆశపడలేదు

మా కుటుంబం కోసం ‘హెరిటేజ్‌’ ఉంది

కుప్పం ప్రజలతో నారా భువనేశ్వరి

కుప్పం, జూలై 25: ‘మేము ఏనాడూ అవినీతి సొమ్ముకు ఆశపడలేదు. అవినీతి సొమ్ము ఎంత సంపాదించినా పాపాలను మూటగట్టుకోవడం తప్ప అది చేతిలో నిలవదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా మూడో రోజైన గురువారం ఆమె శాంతిపురం, రామకుప్పం మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ.. తమ కుటుంబం కోసం హెరిటేజ్‌ను స్థాపించామని, ప్రజల సొమ్ము తమకు అవసరంలేదన్నారు. రాజకీయాలపైనే తమ కుటుంబం అధారపడాలన్న ఉద్దేశం చంద్రబాబుకు ఏ కోశానా లేదన్నారు. ప్రజాధనం దోచుకోవాలని ఆయన ఏనాడూ అనుకోలేదన్నారు. చంద్రబాబుపైన, హెరిటేజ్‌పైన అనేక కేసులు పెట్టి గత ప్రభుత్వం అవినీతి అంటించడానికి ఎంతగానో ప్రయత్నించిందని గుర్తుచేశారు. వారి ప్రయత్నాలు ఫలించలేదని, చంద్రబాబు నిజాయితీ ఎన్నికల సందర్భంగా ప్రజా క్షేత్రంలో నిరూపితమైందని భువనేశ్వరి తెలిపారు.

Updated Date - Jul 26 , 2024 | 03:05 AM