Share News

AP Politics: ఇంత సీక్రెట్‌గా ఎందుకు సీఎస్..?

ABN , Publish Date - May 21 , 2024 | 03:01 AM

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కేఎస్‌ జవహర్‌ రెడ్డి ఏం చేసినా సీక్రెట్‌గానే చేసేస్తున్నారు. అసలే ఎలక్షన్ హీట్‌లో ఉంటే..

AP Politics: ఇంత సీక్రెట్‌గా ఎందుకు సీఎస్..?

గుట్టుగా వచ్చి.. వెళ్లిన జవహర్‌రెడ్డి

విజయనగరం, మే 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) కేఎస్‌ జవహర్‌ రెడ్డి సోమవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. భోగాపురం మండలంలో జరుగుతున్న అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయ పనులను ఆయన పరిశీలించారు. ఈ విషయమై అధికారులకు ముందుగానే సమాచారం ఉన్నా కనీసం బయటకు పొక్కనీయలేదు. జిల్లాకు ఏ అధికారి వచ్చినా జిల్లా పౌర సంబంధాల అధికారులు మెయిల్‌, వాట్సాప్‌ గ్రూపులో వివరాలు తెలియజేస్తుంటారు. కానీ సీఎస్‌ జిల్లాకు వస్తున్న విషయాన్ని మాత్రం అత్యంత రహస్యంగా ఉంచారు. ఆయన వెళ్లిన తర్వాత మాత్రమే మీడియాకు వివరాలు చెప్పారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను సీఎస్‌ పరిశీలించారు. నిర్దిష్ట సమయానికి పనులు పూర్తి చేయాలని నిర్మాణ కంపెనీని ఆదేశించారు.

Updated Date - May 21 , 2024 | 09:06 AM