Share News

AP Election 2024: అది ఫేక్ ప్రచారమే.. రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేశారు: దేవినేని ఉమ

ABN , Publish Date - May 12 , 2024 | 07:54 PM

పోలింగ్‌కు మరికొన్ని గంటలే సమయమే ఉంది. కానీ అధికారి వైఎస్సార్పీపీ (YSRCP) మాత్రం కుయుక్తులకు పాల్పడటంలో ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీలు కుట్రలకు పాల్పడుతోంది. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీపై మరోసారి కుట్ర పన్నింది.

AP Election 2024: అది ఫేక్ ప్రచారమే.. రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేశారు: దేవినేని ఉమ
Devineni Uma

అమరావతి: పోలింగ్‌కు మరికొన్ని గంటలే సమయమే ఉంది. కానీ అధికారి వైఎస్సార్పీపీ (YSRCP) మాత్రం కుయుక్తులకు పాల్పడటంలో ఏమాత్రం తగ్గడం లేదు. మరోసారి అధికారంలోకి రావడానికి వైసీపీలు కుట్రలకు పాల్పడుతోంది. దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీపై మరోసారి కుట్ర పన్నింది.

ఏఎన్ఐకి టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూపై వైఎస్సార్పీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలకు తెగబడింది. అయితే ఎన్నికల కమిషన్‌కు మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma) ఆదివారం(ఈరోజు) ఫిర్యాదు చేశారు.


Lok Sabha Elections: ఓటెయ్యండి.. బంపర్ ఆఫర్స్ కొట్టేయండి.. వివరాలివే..

ఏఎన్ఐకి టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన ఇంటర్‌వ్యూపై వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారాలు చేస్తుందని ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పినట్లు ఒక ఫేక్ వీడియోను తయారు చేసి వైసీపీ అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారని తెలిపారు. కులాల మధ్య విభేదాలు సృష్టించి, ఎన్నికలకు ఒక్క రోజు ముందు రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ పన్నిన కుట్ర ఇదని అన్నారు.

ఈనాడు, టీవీ5లపై వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని ఖండించారు. ఐదేళ్లు ఫేక్ సామ్రాజ్యంలో వైసీపీ, వైసీపీ నాయకులు బతికారని మండిపడ్డారు.ఓడిపోతున్నామనే భయంతో హైదరాబాద్ లోటస్ పాండ్ వైసీపీ ఫేక్ ముఠా అలెర్ట్ అయిందన్నారు. ఎన్నికల కోడ్ వచ్చినా, సైలెంట్ పీరియడ్ అమల్లో ఉన్నా వైసీపీ ఫేక్ బతుకులు మాత్రం మారలేదని విమర్శించారు.

చంద్రబాబు, ఈనాడు, టీవీ5 లపై తప్పుడు వార్తలు సృష్టించి ఎన్నికల లబ్ధి పొందాలని వైసీపీ కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. 2019లో విజయ్ సాయిరెడ్డి దుష్ప్రచారాలు చేసినట్లే ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు. వైసీపీ సోషల్ మీడియా హెడ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.


కావాల్సిన విధంగా చంద్రబాబు మాటలను వక్రీకరించి వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. వైసీపీ సోషల్ మీడియా హెడ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోరారు. ఈ నకిలీ వీడియోను ప్రసారం చేయకుండా ఎన్నికల సంఘం అడ్డుకోవాలని దేవినేని ఉమా ఎన్నికల సంఘాని దేవినేని ఉమా కోరారు.

Election 2024: ఓటు వేసేందుకు సెల్‌ఫోన్ తీసుకెళ్లొచ్చా.. మర్చిపోయి తీసుకెళ్తే ఎలా..?

Read Latest AP News And Telugu News

Updated Date - May 12 , 2024 | 09:01 PM