Share News

Breaking News: ఈవీఎం పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డికి బిగ్ షాక్

ABN , Publish Date - Jun 26 , 2024 | 03:28 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం పగలగొట్టిన మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది.

Breaking News: ఈవీఎం పగలగొట్టిన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డికి బిగ్ షాక్

అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం పగలగొట్టిన మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి (Pinnelli Ramakrishna Reddy) బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో రామకృష్ణా రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తోసిపుచ్చింది.


హత్యాయత్నం కేసులు రెండింటిలో ఇప్పటివరకు మధ్యంతర బెయిల్‌పై ఉన్నారు. తాజాగా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్ట్‌లో పిటిషన్లు వేశారు. హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోరగా కోర్టు తిరస్కరించింది. ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో టీడీపీ ఏజెంట్‌పై దాడి చేసిన ఘటనలో పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదయింది. కారంపూడిలో దాడి కేసులో సీఐ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పిన్నెల్లి బ్రదర్స్‌పై మరో హత్యాయత్నం కేసు నమోదయింది. ఇవి కాకుండా ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో మరో కేసు నమోదయింది. మొత్తం నాలుగు కేసులు ఆయనపై ఉన్నాయి.


ఈ నాలుగు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్లు వేశారు. గతంలో ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే ఈ మధ్యంతర బెయిల్‌పై బాధితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. అప్పట్లో హైకోర్ట్ మధ్యంతర బెయి‌ల్‌పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో పిన్నెల్లి పిటిషన్లుపై గతంలోనే వాదనలు విన్న ఏపీ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరింది. కాగా మధ్యంతర బెయిల్ పిటిషన్లు కొట్టివేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇవాళ (బుధవారం) అరెస్ట్ చేసే అవకాశం ఉంది.


కాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి ధ్వంసం చేశారు. దీంతో ఆయనపై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఎన్నికల హింస నేపథ్యంలో మిగతా కేసులు కూడా ఆయనపై నమోదయ్యాయి. అయితే ఎన్నికల ఫలితాలకు ముందు అరెస్ట్ కాకుండా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ మినహాయింపు పొందారు. ఓట్ల లెక్కింపు తర్వాత జూన్ 6వ తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ధర్మాసనం పోలీసులను ఆదేశించింది. ఆ తర్వాత కూడా పొడగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మినహాయింపులను హైకోర్టు నేడు కొట్టివేసింది.

Updated Date - Jun 26 , 2024 | 04:19 PM