Share News

మండిపల్లి ఎంపికపై టీడీపీ శ్రేణుల సంబరాలు

ABN , Publish Date - Feb 24 , 2024 | 11:06 PM

రాయచోటి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మండి పల్లి రాంప్రసాద్‌రెడ్డి ఎంపిక కావడంతో మండిపల్లి భవన్‌ వద్ద శనివారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసు కున్నారు.

మండిపల్లి ఎంపికపై టీడీపీ శ్రేణుల సంబరాలు
మీడియాతో మాట్లాడుతున్న మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

రాయచోటిటౌన్‌, ఫిబ్రవరి 24: రాయచోటి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మండి పల్లి రాంప్రసాద్‌రెడ్డి ఎంపిక కావడంతో మండిపల్లి భవన్‌ వద్ద శనివారం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బాణసంచా పేలుస్తూ సంబరాలు చేసు కున్నారు. ఈ సందర్భంగా మండి పల్లి రాంప్రసాద్‌రెడ్డి ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూజలు చేసి, బాణసంచా పేల్చి, కేక్‌ కట్‌ చేసి అందరికీ పంచిపెట్టారు. . అనంతరం మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో టికెట్‌ కేటాయించినందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చంనాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ గెలుపు కోసం తెలుగుదేశం, జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో కృషి చేయాలని, మన బిడ్డల భవిష్యత్తు కోసం తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ప్రభుత్వం తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజక వర్గంలోని అన్ని మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మండిపల్లి కుటుంబ అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 09:49 AM