Share News

వరద బాధితులకు విరాళాలు

ABN , Publish Date - Sep 14 , 2024 | 01:07 AM

విజయవాడ వరద బాధితుల సహాయార్థం, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆలిండియా సెంట్రల్‌ పారా మిలిటరీ ఫోర్సెస్‌ ఎక్స్‌ సర్వీస్‌ మెన వెల్ఫేర్‌ అసోసియేషన నాయకులు విరాళం అందిం చారు.

వరద బాధితులకు విరాళాలు
కలెక్టర్‌కు విరాళం అందజేస్తున్న నాయకులు

కర్నూలు(కల్చరల్‌), సెప్టెంబరు 13: విజయవాడ వరద బాధితుల సహాయార్థం, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆలిండియా సెంట్రల్‌ పారా మిలిటరీ ఫోర్సెస్‌ ఎక్స్‌ సర్వీస్‌ మెన వెల్ఫేర్‌ అసోసియేషన నాయకులు విరాళం అందిం చారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పి.రంజితబాషాకు రూ.75 వేల విరాళాన్ని చెక్కురూపంలో అందజేశారు. అసోసి యేషన జిల్లా కమిటీ తర పున అసోసియేషన అధ్యక్షుడు ఎస్‌. బాలరంగయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ అసోసియేషన కార్యదర్శి జి. శేషారెడ్డి, యూనియన ట్రెజరర్‌ పీటీ స్వామి, యూనియన సలహాదారులు కేకే రావు, కేసీఎస్‌ రాయుడు పాల్గొన్నారు.

సి.బెళగల్‌: విజయవాడ వరద బాధితులకు సి.బెళగల్‌ పీహెచసీలో ఆశా వర్కర్‌గా పనిచేస్తున్న ఈరమ్మ ఒక నెల గౌరవ వేతనాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ విరాళాన్ని ఆమె భర్త బడెసా టీడీపీ సీనియర్‌ నాయకుడు ఎదురూరు విష్ణువర్ధనరెడ్డికి అందజేశారు. టీడీపీ నాకుడు తిమ్మప్ప, ఎంపీటీసీ ఈరన్న గౌడు, విష్ణుసేన నాయకుడు భీమన్న, తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 14 , 2024 | 01:07 AM