Share News

EVMs Destroyed : ఈవీఎంలు ధ్వంసం చేసిన దుండగులు..నిలిచిన పోలింగ్

ABN , Publish Date - May 13 , 2024 | 10:01 AM

ఏపీలో సార్వత్రిక ఎన్నికల(ap elections 2024) వేళ రసవత్తర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా(annamayya district) పుల్లంపేట మండలం దలవాయిపల్లిలో ఉద్రిక్త పరిస్థతి చోటుచేసుకుంది. పలువురు వ్యక్తులు వచ్చి ఆకస్మాత్తుగా ఈవీఎంలను(EVMs) పగులగొట్టారు.

EVMs Destroyed : ఈవీఎంలు ధ్వంసం చేసిన దుండగులు..నిలిచిన పోలింగ్
File pic

ఏపీలో సార్వత్రిక ఎన్నికల(ap elections 2024) వేళ రసవత్తర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అన్నమయ్య జిల్లా(annamayya district) పుల్లంపేట మండలం దలవాయిపల్లిలో ఉద్రిక్త పరిస్థతి చోటుచేసుకుంది. పలువురు వ్యక్తులు వచ్చి ఆకస్మాత్తుగా ఈవీఎంలను(EVMs) పగులగొట్టారు. దీంతో ఆ పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తగా, పోలింగ్ నిలిచిపోయింది. మరోవైపు అక్కడే ఉన్న పోలింగ్ ఏజెంట్ రాజారెడ్డిని కిడ్నాప్ చేశారని జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ శ్రేణులు అతన్ని బలవంతంగా పోలింగ్ కేంద్రం నుంచి తీసుకెళ్లారని అన్నారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా ప్రజలు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి..

Pawan Kalyan: ఓటు వేసిన పవన్ కల్యాణ్..ఎక్కడంటే


AP Elections: జనసేన ఎంపీ అభ్యర్థి ముఖంపై సీల్ ముద్ర.. టీడీపీ ఆందోళన

Read Latest AP News And Telugu News

Updated Date - May 13 , 2024 | 10:03 AM