Share News

TDP : వెయ్యి పేద కుటుంబాలకు ప్రెషర్ కుక్కర్లు పంపిణీ చేసిన మన్నవ

ABN , Publish Date - Jan 09 , 2024 | 01:12 PM

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పశ్చిమనియోజకవర్గంలోని 1000 పేద కుటుంబాలకు సోమవారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ ప్రెషర్‌ కుక్కర్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..

TDP : వెయ్యి పేద కుటుంబాలకు ప్రెషర్ కుక్కర్లు పంపిణీ  చేసిన మన్నవ

గుంటూరు, జనవరి 8 : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పశ్చిమనియోజకవర్గంలోని 1000 పేద కుటుంబాలకు సోమవారం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహనకృష్ణ ప్రెషర్‌ కుక్కర్లను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పన్నులు, అధిక ధరలు, ఉపాధి లేమితో జగన్‌ పాలనలో రాష్ట్ర ప్రజలు ఇక్కట్ల పాలయ్యారని, నాలుగున్నరేళ్లలో మధ్య తరగతి ప్రజలు పేదలుగా, పేదలు నిరుపేదలుగా మారిపోయారని విమర్శించారు. తమకు గొప్పగా మేలు చేసి ఉద్దరిస్తాడని ఓట్లేసిన ప్రజలకు నాలుగున్నరేళ్లలో జగన్‌ నరకం చూపించాడని అన్నారు. ఈపరిస్థితిని అధిగమించడంకోసం నియోజక వర్గ పరిధిలోని పేదకుటుం బాలకు మన్నవ మోహనకృష్ణ చారిటబుల్‌ ట్రస్టు ద్వారా గత ఐదేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రజల సంక్షేమం సాధ్యమని మన్నవ స్పష్టం చేశారు.

Mannava-Mohana-Krishna-3.jpgMannava-Mohana-Krishna.jpg

Updated Date - Jan 09 , 2024 | 01:12 PM