Share News

Stock Market: మళ్లీ కొత్త గరిష్టానికి సెన్సెక్స్, నిఫ్టీ.. టాప్ 5 స్టాక్స్ ఇవే

ABN , Publish Date - Jul 04 , 2024 | 10:24 AM

దేశీయ స్టాక్ మార్కెట్ల(Stock Market) వారం వారీ గడువు ముగియడంతో నేడు(జులై 4న) కూడా రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి. దీంతో మార్కెట్లు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఐటీ షేర్లు అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి. ఆ క్రమంలో బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ 80,375 వద్ద రికార్డు స్థాయిని తాకింది.

Stock Market: మళ్లీ కొత్త గరిష్టానికి సెన్సెక్స్, నిఫ్టీ.. టాప్ 5 స్టాక్స్ ఇవే
july 4th 2024 stock market updates

దేశీయ స్టాక్ మార్కెట్ల(Stock Market) వారం వారీ గడువు ముగియడంతో నేడు(జులై 4న) కూడా రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి. దీంతో మార్కెట్లు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఐటీ షేర్లు అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి. ఆ క్రమంలో బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ 80,375 వద్ద రికార్డు స్థాయిని తాకింది. 326 పాయింట్లు పెరిగి 80,336 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ50 తాజా జీవితకాల గరిష్ఠ స్థాయి 24,401ని తాకింది. 96 పాయింట్లు పెరిగి 24,382 స్థాయిల వద్ద ట్రేడవుతోంది. దీంతోపాటు బ్యాంక్ నిఫ్టీ 268 పాయింట్ల లాభంతో 53,357 వద్ద రికార్డు స్థాయిలో మొదలైంది.


ప్రస్తుతం లాభపడిన/నష్టపోయిన టాప్ కంపెనీల షేర్లు

టాప్ 5 గెయినర్ స్టాక్స్: HCL టెక్, ICICI బ్యాంక్, HDFC లైఫ్, టాటా మోటార్స్, హిందాల్కో

టాప్ 5 లూజర్ స్టాక్స్: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్‌ప్రైస్, సిప్లా, టైటాన్ కంపెనీ

ఈ క్రమంలోనే BSE మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు వరుసగా 0.36 శాతం, 0.57 శాతం చొప్పున పురోగమించాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఐటి ఇండెక్స్ అత్యధికంగా లాభపడగా, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ టాప్ లాగార్డ్ (0.06 శాతం తగ్గింది). గురువారం ప్రారంభ ట్రేడ్‌లో సెన్సెక్స్ 80,300 మార్క్‌ను అధిగమించగా, నిఫ్టీ 50 24,350 స్థాయిలను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా అనుకూల ధోరణుల నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త రికార్డులను తాకాయి.


హిందుస్థాన్ యూనిలీవర్, ITC, ఏషియన్ పెయింట్స్ వంటి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) హెవీవెయిట్‌ల నుంచి పరిమిత మద్దతు ఉన్నప్పటికీ భారతీయ ఈక్విటీ మార్కెట్‌లో ఇటీవలి ర్యాలీ జరిగింది. ప్రస్తుతం తాజాగా వచ్చిన ఫలితాల్లో బంధన్ బ్యాంక్ 21.8% సంవత్సరపు వృద్ధిని నమోదు చేసింది. బెంచ్‌మార్క్ S&P BSE సెన్సెక్స్ తొలిసారిగా 80,000 మార్క్‌ను దాటడంతో భారత ఈక్విటీ మార్కెట్ బుధవారం కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ నిఫ్టీ 50 కూడా రోజులో 24,300ని దాటి 0.67 శాతం లాభాలతో ముగిసింది.


ఇది కూడా చదవండి:

Swiggy: 2030నాటికి రూ.10 లక్షల కోట్లకు చేరనున్న ఫుడ్ మార్కెట్

Gold and Silver Rate: పెరిగిన గోల్డ్ ధరలకు బ్రేక్.. తగ్గిన బంగారం, పెరిగిన వెండి

For Latest News and Business News click here

Updated Date - Jul 04 , 2024 | 10:42 AM