Share News

పిట్టీ ఇంజనీరింగ్‌ చేతికి దక్షిణ్‌ ఫౌండ్రీ

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:23 AM

దక్షిణ్‌ ఫౌండ్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (డీఎఫ్‌పీఎల్‌)లో 100 శాతం వాటాలను రూ.153.12 కోట్లకు కొనుగోలు చేసినట్లు పిట్టీ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. డీఎఫ్‌పీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న పదిహేను రోజుల్లో...

పిట్టీ ఇంజనీరింగ్‌ చేతికి దక్షిణ్‌ ఫౌండ్రీ

డీల్‌ విలువ రూ.153 కోట్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దక్షిణ్‌ ఫౌండ్రీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (డీఎఫ్‌పీఎల్‌)లో 100 శాతం వాటాలను రూ.153.12 కోట్లకు కొనుగోలు చేసినట్లు పిట్టీ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ వెల్లడించింది. డీఎఫ్‌పీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న పదిహేను రోజుల్లో ఈ డీల్‌ను పూర్తి చేయనున్నట్లు పేర్కొంది. జూన్‌ త్రైమాసికం ముగిసే నాటికి డీఎఫ్‌పీఎల్‌ వద్ద రూ.42.71 కోట్ల నగదు, బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉంది. డక్టైల్‌ ఐరన్‌, గ్రే ఐరన్‌, లో కార్బన్‌ అల్లాయ్‌ స్టీల్‌ గ్రేడ్స్‌, సిమో ఐరన్‌ కాస్టింగ్స్‌ తయారీలో డీఎఫ్‌పీఎల్‌ కీలకంగా ఉంది. బెంగళూరు, హోస్కోట్‌లో ఏటా 4,200 టన్నుల స్థాపిత సామర్థ్యం కలిగిన రెండు ప్లాంట్లను నిర్వహిస్తోంది. డీఎఫ్‌పీఎల్‌ కొనుగోలుతో పిట్టీ ఇంజనీరింగ్‌ ఉత్పత్తి సామర్థ్యపరంగా మరింత బలోపేతం కానుందని సంస్థ ఎండీ అక్షయ్‌ ఎస్‌ పిట్టీ తెలిపారు.

Updated Date - Jul 26 , 2024 | 04:23 AM