Share News

Stock Market: దేశీయ సూచీలకు లాభాలు.. 267 పాయింట్లు ఆర్జించిన సెన్సెక్స్!

ABN , Publish Date - May 22 , 2024 | 04:20 PM

మంగళవారం స్వల్పంగా నష్టపోయిన దేశీయ సూచీలు బుధవారం జోరు చూపించాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్ లాభపడింది. మరో వైపు నిఫ్టీ కూడా 68 పాయింట్లు ఆర్జించి పాజిటివ్‌గా రోజును ముగించింది.

Stock Market: దేశీయ సూచీలకు లాభాలు.. 267 పాయింట్లు ఆర్జించిన సెన్సెక్స్!
Stock Market

మంగళవారం స్వల్పంగా నష్టపోయిన దేశీయ సూచీలు బుధవారం జోరు చూపించాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్ వంటి హెవీ వెయిట్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సెన్సెక్స్ లాభపడింది. మరో వైపు నిఫ్టీ కూడా 68 పాయింట్లు ఆర్జించి పాజిటివ్‌గా రోజును ముగించింది. (Business News).


మంగళవారం ముగింపు (73,953)తో పోల్చితే దాదాపు 200 పాయింట్ల లాభంతో బుధవారం ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా మంచి జోరు చూపించింది. సెన్సెక్స్ బుధవారం 73,860-74,3079 శ్రేణి మధ్య కదలాడింది. చివరకు 267 పాయింట్ల లాభంతో 74,2213 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ 68 పాయింట్ల లాభంతో 22,597 వద్ద రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ మాత్రం 266 పాయింట్లు నష్టపోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 99 పాయింట్లు ఆర్జించింది.


గ్రాన్యుయల్స్ ఇండియా, భారత్ ఎలక్ర్టానిక్స్, పీఐ ఇండస్ట్రీస్, పేజ్ ఇండస్ట్రీస్ తదితర షేర్లు లాభపడ్డాయి. భెల్, హింద్ కాపర్, ఐఈఎక్స్, ఎన్‌ఎమ్‌డీసీ షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 82.28 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి..

Buddha Purnima: ఈ రాష్ట్రాల్లో రేపు బ్యాంకులు బంద్.. ఎందుకంటే


PM Modi: సక్సెస్‌కు ఇంటిపేరు అవసరం లేదు.. జొమాటో సీఈవోపై మోదీ ప్రశంసలు..


మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2024 | 04:20 PM