Share News

Kaivalya Vohra: 21 ఏళ్లకే రూ.3,600 కోట్లు సంపాదించిన యంగ్ ఇండియన్.. హురున్ రిచ్ లిస్ట్‌లో

ABN , Publish Date - Aug 29 , 2024 | 05:50 PM

హురున్ ఇండియా 2024(Hurun Rich List 2024) నివేదిక ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈసారి భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. దేశంలో బిలియనీర్ల సంఖ్య 300 దాటింది. ఈ జాబితాలో 21 ఏళ్లకే ఓ యువ వ్యాపారవేత్త దాదాపు రూ.3600 కోట్లు సంపాదించారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

 Kaivalya Vohra: 21 ఏళ్లకే రూ.3,600 కోట్లు సంపాదించిన యంగ్ ఇండియన్.. హురున్ రిచ్ లిస్ట్‌లో
Young Indian Kaivalya Vohra

భారతదేశంలో ధనవంతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలోనే హురున్ ఇండియా 2024(Hurun Rich List 2024) నివేదిక ప్రకారం గతేడాదితో పోలిస్తే ఈసారి భారత్‌లో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. దేశంలో బిలియనీర్ల సంఖ్య 300 దాటింది. హురున్ ఇండియా 2024 సంపన్నుల జాబితా ప్రకారం గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు భారతదేశంలో 75 మంది బిలియనీర్లు పెరిగారు. దీంతో దేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 334కి పెరిగింది.


బిలియనీర్ల సంఖ్య

ఈ సందర్భంగా ‘వెల్త్ క్రియేషన్ ఒలంపిక్స్’లో భారత్ స్వర్ణ పతకాలు సాధిస్తూనే ఉందని హురున్ ఇండియా వ్యవస్థాపకుడు, పరిశోధకుడు అనస్ రెహ్మాన్ జునైద్ అన్నారు. హురున్ ఇండియా 2024 సంపన్నుల జాబితా(richlist)లో బిలియనీర్ల సంఖ్య 300కి చేరుకుందన్నారు. చైనాలో బిలియనీర్ల సంఖ్య 25 శాతం క్షీణించగా, భారత్ మాత్రం 29 శాతం వృద్ధితో 334 బిలియనీర్లుగా రికార్డు సృష్టించింది. మొదటిసారిగా 1,539 మంది వ్యక్తులు హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో చేరారు. ఈ జాబితాలో వ్యాపారం, స్టార్టప్ వ్యవస్థాపకుల నుంచి ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడిదారులు, ఏంజెల్ ఇన్వెస్టర్లు, నెక్స్ట్ జెనరేషన్ లీడర్లు, సినీ తారలు సహా పలువురు ఉన్నారు.


21 ఏళ్లకే

క్విక్ కామర్స్ యాప్ జెప్టో సహ వ్యవస్థాపకుడు కైవల్య వోహ్రా(Kaivalya Vohra) మళ్లీ ఈ జాబితాలో చేరారు. 21 ఏళ్ల వోహ్రా హురున్ విడుదల చేసిన భారతీయ సంపన్నుల జాబితాలో అత్యంత చిన్న వయస్సు వ్యక్తి కావడం విశేషం. ప్రస్తుతం ఆయన నికర సంపద విలువ రూ. 3,600 కోట్లు. ఆయన సహ వ్యవస్థాపకుడు 22 ఏళ్ల ఆదిత్ పాలిచా ఈ జాబితాలో రెండో అతి పిన్న వయస్కుడిగా ఉన్నారు. వోహ్రా, పాలిచా స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు. కోవిడ్ మహమ్మారి రోజుల్లో అవసరమైన వస్తువులను త్వరగా డెలివరీ చేసేందుకు వచ్చిన డిమాండ్‌ను నెరవేర్చేందుకు వీరిద్దరూ కలిసి 2021లో Zeptoని ప్రారంభించారు.


గౌతమ్ అదానీ

ప్రస్తుతం Zepto దేశంలో హైపర్ కాంపిటీటివ్ గ్రోసరీ డెలివరీ స్పేస్‌లో గట్టి పోటీ ఇస్తుంది. మార్కెట్‌లోని ప్రత్యర్థులైన ఇ కామర్స్ దిగ్గజమైన అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లింకిట్, టాటా గ్రూప్ బిగ్‌బాస్కెట్ వంటి వాటితో పోటీలో ఉంది. 19 ఏళ్ల వయసులో కైవల్య వోహ్రా IIFL వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022లో మొదటిసారి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ జాబితాలో కనిపిస్తున్నాడు. భారతదేశంలోని బిలియనీర్ల మొత్తం జాబితాలో గౌతమ్ అదానీ(gautam adani) నికర విలువ రూ. 11.6 లక్షల కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అంబానీ రూ.10.14 లక్షల కోట్లతో రెండో స్థానంలో నిలిచారు.


534 మంది

దేశంలో సంపద సృష్టి విధానం మరింత వికేంద్రీకరించబడింది. గత దశాబ్ద కాలంలో రిచ్ లిస్ట్‌లో ప్రాతినిధ్యం వహించిన భారతీయ నగరాల సంఖ్య గత సంవత్సరం 95 నుంచి 97కి పెరిగింది. జాబితా ప్రారంభమైనప్పటి నుంచి 10 నగరాలు పెరిగాయని నివేదిక పేర్కొంది. భారతదేశంలో మొత్తం 1,539 మంది వ్యక్తులు కనీసం రూ. 1,000 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు హురున్ ఇండియా నివేదిక పేర్కొంది. 5,000 కోట్లను పరిమితిగా తీసుకుంటే, ధనవంతుల జాబితాలో 534 మంది హెచ్‌ఎన్‌ఐలు ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

Personal Loan: పర్సనల్ లోన్స్ తీసుకుంటున్నారా.. ఈ ఛార్జీల విషయంలో జాగ్రత్త

Mukesh Ambani: రిలయన్స్ ఏజీఎం సమావేశంలో ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు

Business Idea: రూ. 15 వేల పెట్టుబడితో వ్యాపారం .. నెలకు రూ.50 వేలకుపైగా ఆదాయం


Bank Holidays: సెప్టెంబర్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్నంటే.. గణేష్ చతుర్థి సహా..

Lowest Interest Car Loans: తక్కువ రేటుకే లక్షల రూపాయల కార్ లోన్స్.. ఈ వివరాలు తెలుసా మీకు..


Read More Business News and Latest Telugu News

Updated Date - Aug 29 , 2024 | 05:52 PM