Share News

Crime News: ఛీ.. వీడసలు మనిషేనా.. మరీ ఇంత ఘోరమా..?

ABN , Publish Date - May 19 , 2024 | 11:17 AM

అనుమానం పెనుభూతం లాంటిదని అంటారు. ఇది ఒక్కసారి మనసులోకి ఎక్కితే.. మనిషిని ఒక మృగంలా మార్చేస్తుంది. ఇది ఎలాంటి దారుణాలైనా చేయిస్తుంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా తాజా ఉదంతాన్నే...

Crime News: ఛీ.. వీడసలు మనిషేనా.. మరీ ఇంత ఘోరమా..?

అనుమానం పెనుభూతం లాంటిదని అంటారు. ఇది ఒక్కసారి మనసులోకి ఎక్కితే.. మనిషిని ఒక మృగంలా మార్చేస్తుంది. ఇది ఎలాంటి దారుణాలైనా చేయిస్తుంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా తాజా ఉదంతాన్నే తీసుకోవచ్చు. అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యకు నరకం చూపించాడు. ఆమె ప్రైవేట్ భాగాలను పదునైన బ్లేడ్‌తో కోసి, రెండు ఇనుప మేకులు వేసి, ఇత్తడి తాళం వేశాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ భయంకరమైన ఘటన మహారాష్ట్రలో (Maharashtra) చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..


స్మృతి ఇరానీపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు.. గత ఐదేళ్లలో..

నేపాల్‌కు (Nepal) చెందిన ఓ వ్యక్తి మహారాష్ట్రంలో వాచ్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం అతనికి నేపాలి అమ్మాయితో వివాహం అయ్యింది. పెళ్లయ్యాక భార్య కూడా మహారాష్ట్రకు వచ్చి భర్త వద్దే ఉండసాగింది. మొదట్లో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. కానీ.. రోజులు గడిచేకొద్దీ భర్తకు భార్యపై అనుమానం పెరిగింది. ఇతరులతో సరదాగా మాట్లాడ్డం చూసి ఓర్వలేకపోయాడు. కచ్ఛితంగా పరాయి వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుందని అతనిలో అనుమానం మరింత బలపడింది. ఆ అనుమానంతోనే అతడు భార్యపై తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఆమె ప్రైవేట్ పార్ట్‌కి తాళం వేయాలని నిర్ణయించాడు.

ఆర్సీబీ హీరో అతడే.. శభాష్ అంటూ ప్రశంసలు

మే 11వ తేదీన తన భార్యని రూంలోకి తీసుకెళ్లి.. ఆమె కాళ్లు, చేతులు కట్టేశాడు. అనంతరం ఒక పదునైన బ్లేడ్ తీసుకొని ప్రైవేట్ పార్ట్ వద్ద రెండు రంధ్రాలు చేసి, ఇనుప మేకులు కుట్టేసి తాళం వేశాడు. తన భర్త ఈ దారుణానికి పాల్పడుతున్న సమయంలో ఆమె సహాయం కోసం గట్టిగట్టిగా అరిచింది. చివరికి చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూడగా.. ఆమె తీవ్ర రక్తస్రావంతో నేలపై పడి ఉంది. చికిత్స నిమిత్తం ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంత బాధలోనూ ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, భర్తపై ఫిర్యాదు చేసింది. భర్తని అరెస్ట్ చేసిన పోలీసులు.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Read Latest Crime News and Telugu News

Updated Date - May 19 , 2024 | 11:17 AM