Home » Crime News
ఆటో డ్రైవర్ హారన్ కొట్టడం కారు డ్రైవర్కు ఇబ్బందికరంగా అనిపించింది. అంతే.. కారు డ్రైవర్తో పాటు కారులో ఉన్న అతని బంధువులు పెద్ద గలాటే సృష్టించారు. నరసాపురం మండలం తూర్పు తాళ్ళు గ్రామంలో ఆటో డ్రైవర్, కారు యజమాని మధ్య హారన్ వివాదం తలెత్తింది.
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న కూతురు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక కన్నవాళ్లే ఆమెను హత్య చేశారు. ఆ తప్పు బయటపడకుండా ఉండాలని తమ ఒక్కగానొక్క బిడ్డ అనారోగ్యంతో మరణించిందని కూతురి అత్తింటి వారిని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ, నిజం బయటకు రావడంతో కటకటాలపాలయ్యారు.
ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)లో మళ్లీ వరదలు(floods) బీభత్సం సృష్టించాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఉత్తర ఆఫ్ఘనిస్థాన్లో ఇటీవల భారీ వర్షాల(rains) కారణంగా ఘోర్, ఫర్యాబ్ ప్రావిన్స్లలో భారీగా వరదలు సంభవించాయి. దీంతో 47 మందికిపైగా మృత్యువాత చెందారు.
పోర్షే లగ్జరీ కారు(Porsche car)లో వేగంగా వస్తున్న వ్యక్తి ఆకస్మాత్తుగా వచ్చి ఓ బైక్ను బలంగా ఢీకొట్టాడు(accident). దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పూణె(pune)లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటలకు చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన ఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అనుమానం పెనుభూతం లాంటిదని అంటారు. ఇది ఒక్కసారి మనసులోకి ఎక్కితే.. మనిషిని ఒక మృగంలా మార్చేస్తుంది. ఇది ఎలాంటి దారుణాలైనా చేయిస్తుంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా తాజా ఉదంతాన్నే...
నెల్లూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా, బుచ్చి మండలం, దామర మడుగు వద్ద ముంబాయి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు వైపు వెళ్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొంది.
హైదరాబాద్: మద్యం కొనేందుకు వెళ్లిన తన భర్తపై వైన్ షాపు సిబ్బంది దాడి చేసి తల పగల గొట్టారు. రక్తంతో ఇంటికి వచ్చిన భర్తను చూసిన భార్య ఆగ్రహంతో రెచ్చిపోయింది. వెంటనే కొంతమందిని తీసుకుని వైన్ షాప్కు వెళ్లి సిబ్బందిపై దాడి చేసింది. అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులను జుట్టు పట్టుకుని కొట్టింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించి.. సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాల ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎలాగోలా అమాయకుల్ని మభ్యపెట్టి, వారి వద్ద నుంచి లక్షల రూపాయలు..
ఇటివల కాలంలో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నకిలీ ఎంబీబీఎస్(MBBS) డిగ్రీ ఆధారంగా పలువురు క్లినిక్ ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్న ఉందంతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్(hyderabad) బోరబండ(borabanda) పరిధిలో ఇద్దరు ఫేక్ డాక్టర్ల గుట్టును అధికారులు ఛేధించారు.
డబ్బు కోసం ఏకంగా భర్త, అత్తపైనే దాడి చేయించిందో మహిళ. అత్తను చంపేస్తే ఇన్స్యూరెన్స్ డబ్బులు వస్తాయని భావించింది. మానవత్వం మరచి.. తన తరుఫు బంధువులను అరేంజ్ చేసి మరీ కొట్టించిన ఘటన స్థానికంగా పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కట్టేల మండి సమీపంలో భర్త, అత్తపై బంధువులతో భార్య దాడి చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.