Share News

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరోతరగతి ప్రవేశాలు

ABN , Publish Date - Jul 19 , 2024 | 06:09 AM

నవోదయ విద్యాలయ సమితి(ఎన్‌వీఎస్‌)- దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ‘జవహర్‌ నవోదయ విద్యాలయ సెలెక్షన్‌ టెస్ట్‌(జేఎన్‌వీఎ్‌సటీ) 2025’ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు.

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరోతరగతి ప్రవేశాలు

నవోదయ విద్యాలయ సమితి(ఎన్‌వీఎస్‌)- దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ‘జవహర్‌ నవోదయ విద్యాలయ సెలెక్షన్‌ టెస్ట్‌(జేఎన్‌వీఎ్‌సటీ) 2025’ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. ఇవి కో-ఎడ్యుకేషనల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు. బాల బాలికలకు విడివిడిగా హాస్టల్స్‌ ఉంటాయి. భోజన, వసతి సౌకర్యాలతోపాటు పన్నెండో తరగతి వరకు బోధన ఉచితం. యూనిఫాం, పాఠ్య పుస్తకాలు కూడా ఇస్తారు. తొమ్మిది నుంచి పన్నెండో తరగతి విద్యార్థులు మాత్రం విద్యాలయ వికాస్‌ నిధి కోసం నెలకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. బాలికలు; దివ్యాంగులు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు; పేదింటి పిల్లలకు దీని నుంచి మినహాయింపు వర్తిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలైతే నెలకు రూ.1500 చెల్లించాలి. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు మాతృభాష/ప్రాంతీయ భాషలో బోధన ఉంటుంది. తరవాత మేథమెటిక్స్‌, సైన్స్‌ సబ్జెక్టులను ఆంగ్ల మాధ్యమంలో; సోషల్‌ సైన్స్‌ను హిందీలో బోధిస్తారు. ఈ విద్యాలయాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎ్‌సఈ) వార్షిక పరీక్షలు నిర్వహిస్తుంది.

విద్యాలయాలు-సీట్లు: దేశవ్యాప్తంగా మొత్తం 653 జేఎన్‌వీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 13 విద్యాలయాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ వర్గాల జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలకు మరో రెండు విద్యాలయాలు కేటాయించారు. తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో ఆరోతరగతిలో గరిష్ఠంగా 80 మందికి అవకాశం కల్పిస్తారు. జిల్లాల వారీగా సంబంధిత జేఎన్‌వీల్లో గ్రామీణ విద్యార్థులకు 75 శాతం సీట్లు ప్రత్యేకించారు.

అర్హత వివరాలు: ప్రస్తుతం ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో అయిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌ఐఓఎస్‌ నుంచి 2024 సెప్టెంబరు 15 నాటికి ‘బి’ సర్టిఫికెట్‌ కాంపిటెన్సీ కోర్సు పూర్తిచేసేవారు కూడా అర్హులే. విద్యార్థులు 2013 మే 1 నుంచి 2015 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.

జేఎన్‌వీ సెలెక్షన్‌ టెస్ట్‌: దీనిని ఆబ్జెక్టివ్‌ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. మొత్తం మార్కులు 100. ఈ పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి. వీటిలో మొత్తం 80 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌లో 40 ప్రశ్నలు అడుగుతారు. దీనికి 50 మార్కులు కేటాయించారు. అర్థమెటిక్‌ టెస్ట్‌, లాంగ్వేజ్‌ టెస్ట్‌ల్లో ఒక్కోదానిలో 20 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో దానికి 25 మార్కులు ఉంటాయి. నెగెటివ్‌ మార్కులు లేవు. మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌కు గంట; మిగిలినవాటికి ఒక్కోదానికి అర్ధగంట పరీక్ష సమయం ఇస్తారు. విద్యార్థులు బ్లూ/బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌తో ఓఎంఆర్‌ పత్రం మీద సమాధానాలు గుర్తించాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరీక్షని తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. పరీక్ష సిలబస్‌ కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.

  • ముఖ్య సమాచారం

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 16

జేఎన్‌వీ సెలెక్షన్‌ టెస్ట్‌ తేదీలు: 2025 జనవరి 18, ఏప్రిల్‌ 12

వెబ్‌సైట్‌:www.navodaya.gov.in

Updated Date - Jul 19 , 2024 | 06:09 AM