Share News

US car accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు గుజరాతీ మహిళలు మృతి

ABN , Publish Date - Apr 27 , 2024 | 06:08 PM

అమెరికాలోని సౌత్ కరోలినాలో శనివారంనాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రీన్‌విల్లే కౌంటీలో ఓ బ్రిడ్జిపై నుంచి వేగంగా వెళ్తున్న ఎస్‌యూవీ పల్టీలు కొడుకు గాలిలోకి ఎగిరి ఒక చెట్టుపై ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం పాలయ్యారు.

US car accident: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు గుజరాతీ మహిళలు మృతి

సౌత్ కరోలినా: అమెరికా (USA)లోని సౌత్ కరోలినా (South Carolina)లో శనివారంనాడు ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. గ్రీన్‌విల్లే కౌంటీలో ఓ బ్రిడ్జిపై నుంచి వేగంగా వెళ్తున్న ఎస్‌యూవీ (SUV) పల్టీలు కొడుకు గాలిలోకి ఎగిరి ఒక చెట్టుపై ఇరుక్కుపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు దుర్మరణం పాలయ్యారు. వీరిని గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీశాబన్ పటేల్‌గా అధికారులు గుర్తించారు.

Fire Accident: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి, 13 మందికి గాయాలు


పరిమితికి మించిన వేగంతో ఎస్‌యూవీ దూసుకు వెళ్లడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోందని, ఇది చాలా అరుదైన ఘటన అని గ్రీన్‌విల్లె కౌంటీ అధికారి మెక్ ఎల్లిస్ తెలిపారు. అదుపుతప్పిన ఎస్‌యూవీ హైవేపై పల్టీలు కొడుతూ గాల్లోకి 20 అడుగుల ఎత్తుకు లేచి బ్రిడ్జికి ఎదురుగా ఉన్న చెట్టుపైకి ఎగిరిపడిందని, అక్కడ చిక్కుకుపోయిందని చెప్పారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే అత్యవసర స్పందన బృందాలు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టగా, ప్రమాదంలో గాయపడిన ఒక వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

Read Latest International News and Telugu News

Updated Date - Apr 27 , 2024 | 06:08 PM