Home » International
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గల్లంతైంది. పొరుగుదేశం అజర్బైజాన్, ఇరాన్లోని తూర్పు అజర్బైజాన్ ప్రావిన్స్ సరిహద్దుల్లో ఓ డ్యామ్ ప్రారంభోత్సవానికి ఆయన ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ ఆమిర్ అబ్దులాహియన్, అధికారులు, అంగరక్షకులతో కలిసి హెలికాప్టర్లో బయలుదేరారు.
కిర్గిస్థాన్(Kyrgyzstan) రాజధాని బిష్కేశ్లో మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థులపై రెండు రోజులుగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పాకిస్థాన్కి చెందిన నలుగురు విద్యార్థులు మరణించారు. దాడులు తీవ్రమవుతున్న వేళ భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే 24 గంటలు అందుబాటులో ఉండే 0555710041 ఫోన్ నంబర్ కూడా ఇచ్చింది. తాజాగా కిర్గిస్థాన్లోని యూనివర్సిటీలు, కళాశాలలకు భారత ఎంబసీ లేఖ రాసింది.
ఇరాన్ ప్రెసిడెంట్(iranian president) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(Ebrahim Raisi) ఆ హెలికాప్టర్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)లో మళ్లీ వరదలు(floods) బీభత్సం సృష్టించాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. ఉత్తర ఆఫ్ఘనిస్థాన్లో ఇటీవల భారీ వర్షాల(rains) కారణంగా ఘోర్, ఫర్యాబ్ ప్రావిన్స్లలో భారీగా వరదలు సంభవించాయి. దీంతో 47 మందికిపైగా మృత్యువాత చెందారు.
ప్రపంచవ్యాప్తంగా రెండు, మూడుసార్లు లాక్డౌన్స్ నిర్వహించిన తర్వాత.. కరోనా ప్రభావమైతే గణనీయంగానే తగ్గింది. కొన్ని దేశాల్లో వివిధ వేరియెంట్లు పంజా విసిరినా, కొవిడ్ కేసులు నమోదైనా..
కిర్గిజిస్థాన్(Kyrgyzstan) రాజధాని బిష్కెక్(Bishkek)లో మెడిసిన్ చదువుతున్న పాకిస్థాన్, భారత్కు చెందిన విద్యార్థులపై దాడి(Violence) జరిగినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. పాకిస్థానీ, భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని అంటున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అప్పుడప్పుడు పార్లమెంట్లో విపక్షాలు తారాస్థాయిలో ఆందనళలు చేపట్టే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. గట్టిగట్టిగా నినాదాలు చేయడం, స్పీకర్ దగ్గరకు వెళ్లి నిరసన తెలపడం లాంటి సందర్భాలు..
ఈమధ్య కాలంలో భారత్ పట్ల పాకిస్తాన్ స్వరంలో చాలా మార్పు వచ్చింది. గతంలో ఎల్లప్పుడూ విషం చిమ్మే ఆ దేశం.. ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా.. చంద్రయాన్-3 ప్రాజెక్ట్..
విలన్ను పోలీసులు అరెస్టు చేసి వ్యాన్లో తీసుకువెళ్తారు.. అతని అనుచరులు దారి మధ్యలో కాపుకాసి, వ్యాన్ను అడ్డగించి పోలీసులను కాల్చివేసి తమ నాయకుడిని విడిపించుకొని పోతారు.. ఎన్నో సినిమాల్లో ఈ సీన్ చూసి ఉంటారు. అచ్చం అదే తరహాలో ఫ్రాన్స్లో ఓ గ్యాంగ్ తమ నాయకుడిని పోలీసుల నుంచి విడిపించుకుపోయింది. పోలీసుల కాన్వాయ్ను ఆపి మిషన్ గన్లతో కాల్పులు జరిపి తమ నాయకుడిని తీసుకొని పోయింది. ఈ గ్యాంగ్ జరిపిన దాడిలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు చనిపోయారు.
స్లొవేకియా దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై బుధవారం హత్యాయత్నం జరిగింది. హ్యాండ్లోవా నగరంలో మంత్రిమండలి సమావేశంలో పాల్గొని బయటికొచ్చిన అనంతరం ఆయనపై దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఫికో పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రష్యా అనుకూలుడిగా పేరున్న ఫికో, గతంలో రెండు పర్యాయాలు (2006-10, 20012-18) ప్రధానిగా పనిచేశారు.