Share News

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

ABN , Publish Date - Sep 27 , 2024 | 04:26 AM

కాలిఫోర్నియాలోని ఒక హిందూ ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. శాక్రమెంటోలోని బాప్స్‌ శ్రీ స్వామినారాయణ్‌ మందిరంపై ‘‘హిందువులు వెళ్లిపోవాలి’’ అంటూ నినాదాలు రాసి అక్కడ విధ్వంసం సృష్టించినట్లు ఆసంస్థ తెలిపింది.

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి

వాషింగ్టన్‌, సెప్టెంబరు26: కాలిఫోర్నియాలోని ఒక హిందూ ఆలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. శాక్రమెంటోలోని బాప్స్‌ శ్రీ స్వామినారాయణ్‌ మందిరంపై ‘‘హిందువులు వెళ్లిపోవాలి’’ అంటూ నినాదాలు రాసి అక్కడ విధ్వంసం సృష్టించినట్లు ఆసంస్థ తెలిపింది. పది రోజుల వ్యవధిలోనే హిందువులకు వ్యతిరేకంగా ఇలాంటి దాడులు జరగడం ఇది రెండోసారి అని బాప్స్‌ ప్రజా వ్యవహారాల విభాగం పేర్కొంది. ఈ నెల 17న న్యూయార్క్‌లోని స్వామి నారాయణ్‌ మందిర్‌ వద్ద కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. ఈ ఘటనను తమ సంస్థ తీవ్రంగా ఖండిస్తోందని బాప్స్‌ పేర్కొంది. ఇలాంటి విద్వేషపూరితమైన నేరాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యంత్రాంగంతో కలిసి పనిచేస్తామని తెలిపింది. తాజాగా కాలిఫోర్నియాలో జరిగిన దాడిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - Sep 27 , 2024 | 04:26 AM