Share News

దక్షిణ కొరియా డ్రామాలు చూసినందుకు 30 మంది టీనేజర్ల ఉరితీత

ABN , Publish Date - Jul 20 , 2024 | 06:27 AM

దక్షిణ కొరియా డ్రామాలను(వినోద కార్యక్రమాలు) వీక్షించినందుకు 30 మంది టీనేజర్లకు ఉత్తర కొరియా ఉరిశిక్ష అమలు చేసిందని దక్షిణ కొరియా మీడియా పేర్కొంది.

దక్షిణ కొరియా డ్రామాలు చూసినందుకు 30 మంది టీనేజర్ల ఉరితీత

ప్యాంగ్యాంగ్‌, జూలై 19: దక్షిణ కొరియా డ్రామాలను(వినోద కార్యక్రమాలు) వీక్షించినందుకు 30 మంది టీనేజర్లకు ఉత్తర కొరియా ఉరిశిక్ష అమలు చేసిందని దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. దక్షిణ కొరియాను తమ ప్రధాన శత్రువుగా ఉత్తర కొరియా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. దక్షిణ కొరియా టీవీ కార్యక్రమాలు సహా అన్ని వినోద ప్రసారాలను ఉత్తర కొరియా నిషేధించింది. పెన్‌డ్రైవ్‌ల ద్వారా ఆ కార్యక్రమాలు ఉత్తర కొరియాలోకి వస్తుంటాయి. అయితే నిషేధించిన ఆ కార్యక్రమాలను చూసినందుకే 30 మంది టీనేజర్లను ఉత్తర కొరియా ఉరితీసిందని దక్షిణ కొరియామీడియా పేర్కొంది.

Updated Date - Jul 20 , 2024 | 06:27 AM