Share News

జమ్మూలో ఆర్మీ కెప్టెన్‌ మృతి

ABN , Publish Date - Aug 15 , 2024 | 04:32 AM

జమ్మూ ప్రాంతంలోని దోడా జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్‌ దీపక్‌ సింగ్‌ అమరుడయ్యారు. ఓ ఉగ్రవాది హతమయ్యాడు. దోడాలోని శివ్‌గఢ్‌-అస్సర్‌ అటవీ

జమ్మూలో ఆర్మీ కెప్టెన్‌ మృతి

జమ్మూ, ఆగస్టు 14: జమ్మూ ప్రాంతంలోని దోడా జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆర్మీ కెప్టెన్‌ దీపక్‌ సింగ్‌ అమరుడయ్యారు. ఓ ఉగ్రవాది హతమయ్యాడు. దోడాలోని శివ్‌గఢ్‌-అస్సర్‌ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు బుధవారం ఉదయం నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో దీపక్‌సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - Aug 15 , 2024 | 04:32 AM