Share News

Suresh Gopi :‘మదర్ ఇండియా’ వ్యాఖ్యలపై వివరణ

ABN , Publish Date - Jun 16 , 2024 | 04:06 PM

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని మదర్ ఇండియా అంటూ తాను చేసిన వ్యాఖ్యలు మీడియా తప్పుగా అర్థం చేసుకుందని త్రిశ్శూర్‌ ఎంఫీ, కేంద్ర పెట్రోలియం, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి అన్నారు.

 Suresh Gopi :‘మదర్ ఇండియా’ వ్యాఖ్యలపై వివరణ
BJP MP Suresh Gopi

తిరువనంతపురం, జూన్ 16: భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీని మదర్ ఇండియా అంటూ తాను చేసిన వ్యాఖ్యలు మీడియా తప్పుగా అర్థం చేసుకుందని త్రిశ్శూర్‌ ఎంఫీ, కేంద్ర పెట్రోలియం, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి అన్నారు. ఆదివారం తిరువనంతపురంలో కేంద్ర మంత్రి సురేశ్ గోపి విలేకర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై తాను చేసిన వ్యాఖ్యల గురించి ఆయన వివరణ ఇచ్చారు. ఆమె గురించి తాను తప్పుగా మాట్లాడలేదని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానన్నారు. అయితే తాను మాట్లాడిన భాషలోని అంతరార్థం మీకు అర్థం కాలేదా? అంటూ విలేకర్లను ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు.

Also Read: Amit Shah:జమ్ము కాశ్మీర్‌‌‌లో శాంతి భద్రతలపై సమీక్ష


కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మాజీ సీఎం కరుణాకరన్ తండ్రి లాంటి వారని.. అలాగే దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఇందిరా గాంధీ తల్లి లాంటి వారన్నారు. ఇది ఎవరు అవున్నన్నా కాదన్నా స్పష్టమని.. అందులోభాగంగానే ఇందిరా గాంధీని మదర్ ఇండియా అని తాను పేర్కొన్నాన్నారు. మరోవైపు వరుసగా రెండో రోజు సైతం మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై సురేశ్ గోపి ప్రశంసల జల్లు కురిపించారు. ఇందిరా గాంధీ తుది శ్వాస విడిచే వరకు దేశ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించారన్నారు. స్వాతంత్ర్య అనంతరం దేశ నిర్మాణంలో ఇందిరా గాంధీ అత్యంత కీలకంగా వ్యవహరించారని చెప్పారు. తుది శ్వాస విడిచే వరకు ఆమె ఈ విధంగానే వ్యవహరించారని కేంద్ర మంత్రి సురేశ్ గోపి గుర్తు చేశారు. భారతదేశ నిర్మాణంలో ఇందిర పాత్ర అత్యంత కీలకమన్నారు.

Also Read: Shivraj Singh Chouhan: రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి


త్రిశ్శూర్‌లోని కేరళ మాజీ సీఎం కరుణాకరన్ స్మారక మందిరాన్ని శనివారం సురేశ్ గోపి సందర్శించారు. ఆ క్రమంలో ఇందిరా గాంధీని మదర్ ఆఫ్ ఇండియా అని, కరుణాకరన్.. దైర్యం గల పరిపాలకుడు అంటూ ఆయన అభివర్ణించారు. అలాగే తనకు కరుణాకరన్‌తోపాటు కమ్యూనిస్ట్ నాయకుడు ఈకే నాయనార్‌లు రాజకీయ గురువులను కేంద్ర మంత్రి సురేష్ గోపి స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో సురేశ్ గోపి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేరళలో బీజేపీ రెండు స్థానాలను గెలుచుకుంది. అందులో త్రిశ్శూర్‌ ఒకటి. ఈ స్థానం నుంచి సురేశ్ గోపి విజయం సాధించారు. దీంతో తన కేబినెట్‌లో సహాయ మంత్రి పదవిని సురేశ్ గోపికి ప్రధాని మోదీ కేటాయించిన సంగతి తెలిసిందే.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 16 , 2024 | 06:33 PM