Share News

NPS : ఎన్‌పీఎస్‌లో మార్పులపై త్వరలో నిర్ణయం

ABN , Publish Date - Jul 24 , 2024 | 04:47 AM

కొత్త పింఛను పథకం(ఎన్‌పీఎస్‌)లో వివాదాస్పద అంశాలకు పరిష్కారం కనుగొంటామని, త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

NPS : ఎన్‌పీఎస్‌లో మార్పులపై త్వరలో నిర్ణయం

కొత్త పింఛను పథకం(ఎన్‌పీఎస్‌)లో వివాదాస్పద అంశాలకు పరిష్కారం కనుగొంటామని, త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ పథకాన్ని సమీక్షించేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఎంతో పురోగతి సాధించిందని చెప్పారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న పలు రాష్ట్రాలు పాత పింఛను పథకానికి (ఓపీఎస్‌) మళ్లిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోనూ ఉద్యోగ సంఘాలు ఆ డిమాండ్‌ను లేవనెత్తుతున్నాయి.

Updated Date - Jul 24 , 2024 | 04:47 AM