Share News

Digvijaya Singh: మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టును ఆశ్రయించిన దిగ్విజయ్ సింగ్

ABN , Publish Date - Jul 17 , 2024 | 08:01 AM

కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) రాజ్‌గఢ్(Rajgarh) 2024 లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) ప్రక్రియను సవాల్ చేస్తూ జబల్‌పూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రాంతంలో ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు పిటిషన్‌‌లో పేర్కొన్నారు.

Digvijaya Singh: మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోర్టును ఆశ్రయించిన దిగ్విజయ్ సింగ్
Digvijaya Singh

కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) రాజ్‌గఢ్(Rajgarh) 2024 లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) ప్రక్రియను సవాల్ చేస్తూ జబల్‌పూర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ప్రాంతంలో ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నట్లు పిటిషన్‌‌లో పేర్కొన్నారు. ఈవీఎంలు, వీప్యాట్‌లపై ప్రశ్నలను లేవనెత్తుతూ, భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం జిల్లా ఎన్నికల అధికారి కౌంటింగ్ ప్రక్రియ తర్వాత వీప్యాట్ రోల్‌ను భద్రపరచలేదని పిటిషన్‌లో ఆరోపించారు. ఇది ఎన్నికల ఫలితాల సమగ్రతను దెబ్బతీసిందని ఆయన అన్నారు.


బీజేపీ అభ్యర్థి

ఈ క్రమంలో రాజ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గంలో తనను ఓడించిన బీజేపీ నేత రోడ్మల్ నగర్ విజయాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. దిగ్విజయ్ సింగ్ రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయగా, బీజేపీ అభ్యర్థి రోడ్మల్ నగర్(Rodmal Nagar) చేతిలో ఆయన 1.46 లక్షల ఓట్లతో ఓడిపోయారు. కౌంటింగ్ ప్రక్రియ తర్వాత VPAT రోల్ భద్రపరచబడుతుందని భారత ఎన్నికల కమిషన్ స్పష్టమైన మార్గదర్శకాలను కలిగి ఉంది. అయితే కమిషన్ సూచనల మేరకు జిల్లా ఎన్నికల అధికారి అలా చేయలేదని, ఇది ఎన్నికల పవిత్రతను దెబ్బతీసే చర్య అని దిగ్విజయ్ సింగ్ తరఫు న్యాయవాది అగర్వాల్ అన్నారు.


కోర్టు ఆదేశాలు పాటించలే

ఈ సందర్భంగా మాట్లాడిన దిగ్విజయ్ సింగ్ ఈవీఎంల(evms)పై అవిశ్వాసం చాలాసార్లు నమోదైందన్నారు. దీనిపై భారత ఎన్నికల సంఘం(election commission of india), ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదన్నారు. అదే సమయంలో ఏప్రిల్ 26 నాటి సుప్రీంకోర్టు(supreme court) నిర్ణయాన్ని ఎన్నికల సంఘం అమలు చేయడం లేదని తెలిపారు. టెక్నికల్ కారణాలతో తాను పిటిషన్ దాఖలు చేస్తున్నానని, ఇలాంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయని దిగ్విజయ్ సింగ్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని వెల్లడించారు. పిటిషన్‌లో భారత రాజ్యాంగంతో పాటు 'ప్రజా ప్రాతినిధ్య చట్టం' కూడా ఉల్లంఘించబడిందని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ఈ ఎన్నికలను రద్దు చేయాలని కోరారు.


ఇవి కూడా చదవండి:

Delhi: గవర్నర్‌‌ పరువు భంగం కలిగించొద్దు.. మమతా బెనర్జీకి హైకోర్టు సూచన

ప్రైవేటు ఉద్యోగాల్లో 75% స్థానికులకే!


For Latest News and National News click here

Updated Date - Jul 17 , 2024 | 08:05 AM