Share News

MIM leader: మూడు రౌండ్ల కాల్పులు: మాజీ మేయర్‌కి తీవ్ర గాయాలు

ABN , Publish Date - May 27 , 2024 | 01:22 PM

మహారాష్ట్రలోని మాలేగావ్ మాజీ మేయర్, ఎంఐఎం నేత అబ్దుల్ మాలిక్ మహ్మమద్ యూనస్‌పై ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయన్నీ స్థానిక ఆసుపత్రికి తరలించారు

MIM leader: మూడు రౌండ్ల కాల్పులు: మాజీ మేయర్‌కి తీవ్ర గాయాలు
Abdul Malik Mohammed Yunus Isa

నాసిక్, మే 27: మహారాష్ట్రలోని మాలేగావ్ మాజీ మేయర్, ఎంఐఎం నేత అబ్దుల్ మాలిక్ మహ్మమద్ యూనస్‌పై ఆగంతకులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయన్నీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం నాసిక్‌లోని ఆసుపత్రికి అబ్దుల్ మాలిక్‌ను తరలించారు. ఈ కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు మాలెగావ్ నగర పోలీసులు వెల్లడించారు. శనివారం అర్థరాత్రి 1.20 గంటలకు ఓల్డ్ ఆగ్రా రోడ్డులోని తన షాపు బయట కూర్చున్న అబ్దుల్ మాలిక్‌పై ఆగంతకులు తుపాకీతో మూడు రౌండ్ల కాల్పులు జరిపారని తెలిపారు.


ఈ ఘటనలో ఆయన ఛాతీపైన, ఎడమ తోడతోపాటు కుడి చేతికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ తరఫున గతంలో మాలెగావ్ నగర డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా అబ్దుల్ మాలిక్ గెలిచారు. అనంతరం ఆ నగర మేయర్‌‌గా పని చేశారు. అయితే ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీతో అబ్దుల్ మాలిక్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని మాలెగావ్‌లోని ఆ పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.

Read Latest National News and Telugu News

Updated Date - May 27 , 2024 | 01:26 PM