Share News

Toll Tax: ముగిసిన ఎన్నికలు.. ఇకపై బాదుడే బాదుడు

ABN , Publish Date - Jun 02 , 2024 | 07:20 AM

ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో జూన్ 1న టోల్ రేట్ల(toll rates) పెంపుదల ఉండగా, ఈసారి లోక్ సభ ఎన్నికల కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో నేడు (జూన్ 2న) అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల(Toll Plaza) వద్ద పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి.

Toll Tax: ముగిసిన ఎన్నికలు.. ఇకపై బాదుడే బాదుడు
Increase toll charges on June 2nd 2024

ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో జూన్ 1న టోల్ రేట్ల(toll rates) పెంపుదల ఉండగా, ఈసారి లోక్ సభ ఎన్నికల కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో నేడు (జూన్ 2న) అర్ధరాత్రి 12 గంటల నుంచి దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల(Toll Plaza) వద్ద పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు అన్ని టోల్ ప్లాజాల నిర్వాహకులకు ఎన్‌హెచ్‌ఏఐ ఆదేశాలు జారీ చేసింది. టోల్ ట్యాక్స్ ను కనిష్టంగా రూ.5 నుంచి రూ.40 వరకు పెంచాలని నిర్ణయించారు.


ఈ క్రమంలో ట్రక్కులు, బస్సులు, ఇతర వాణిజ్య వాహనాలపై వాటి ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి రేట్లు పెంచబడ్డాయి. అయితే NHAI (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) ఏప్రిల్ 1 నుంచి నేషనల్ హైవే టోల్ ప్లాజాలపై టోల్ టాక్స్ రేట్లను పెంచాలని నిర్ణయించింది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఇది అమలు కాకముందే వాయిదా పడింది. శనివారం ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి టోల్ ట్యాక్స్ పెంచిన రేట్లు అమలు కానున్నాయి.


తెలంగాణలో పంతంగి, కోరలఫడ్, రాయికల్, గూడూరు, పిప్పల్వాడ, రోల్మమ్డ, గంజల్, మనోహరాబాద్, ఇందల్వాయి, సకాపూర్, పుల్లూరు, భిక్నూర్ టోల్ ప్లాజాలు ఉండగా.. ఏపీలో చిల్లకల్లు, ఆమక్తడు, కాసేపల్లి, మరూర్, సూళ్లూరుపేట, బుధానం, నెల్లూరు, కీసర, కాజా, బెల్లుపాడు, మడపం, చిలక్పెలం, నాతవలస, అగ్నంపాడి, వేంపాడు, కృష్ణవరం, కలపర్రు, పొట్టిపాడు, బొల్లాపల్లి, టంగటూర్, ముసునూరు, పంచవటి కాలనీ, గోష్టని గేట్ ఆఫ్ నేవీ, లక్ష్మీపురం, పాలెంపల్లి, S.V పురం, ఉంగుటూరు, ఈతకోట టోల్ ప్లాజాలు కలవు.


ఇది కూడా చదవండి:

Notes Votes : ఓట్ల కోసం నోట్ల వర్షం!


CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు

Read Latest National News and Telugu News

Updated Date - Jun 02 , 2024 | 07:21 AM