Share News

Loksabha Elections 2024: ముందు ఓటు.. తర్వాతే తల్లీ అంత్యక్రియలు

ABN , Publish Date - Jun 01 , 2024 | 04:49 PM

ఓ వైపు లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మరోవైపు కన్నతల్లీ మరణించింది. దీంతో పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుందీ ఆ కుటుంబం. అనంతరం ఆ కుటుంబం తల్లీ అంత్యక్రియల్లో పాల్గొంది. ఈ ఘటన శనివారం అంటే.. జూన్ 1వ తేదీన బిహార్‌లోని జెహనాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని దేవ్‌కులి గ్రామంలో చోటు చేసుకుంది.

Loksabha Elections 2024: ముందు ఓటు.. తర్వాతే తల్లీ అంత్యక్రియలు

పాట్నా, జూన్ 01: ఓ వైపు లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. మరోవైపు కన్నతల్లీ మరణించింది. దీంతో పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుందీ ఆ కుటుంబం. అనంతరం ఆ కుటుంబం తల్లీ అంత్యక్రియల్లో పాల్గొంది. ఈ ఘటన శనివారం అంటే.. జూన్ 1వ తేదీన బిహార్‌లోని జెహనాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని దేవ్‌కులి గ్రామంలో చోటు చేసుకుంది.

Also Read: విమానానికి మళ్లీ బాంబు బెదిరింపు

ఈ ఘటనపై మృతురాలి కుమారుడు మిథిలేష్ యాదవ్ స్పందించాడు. తన తల్లీ ఈ రోజు ఉదయం మరణించింది. ఆమె వయస్సు 80 సంవత్సరాలు. ఆమె తిరిగి రాదు. అంత్యక్రియలు కాసేపు ఆగి చేసుకోవచ్చు. ఎన్నికలు మళ్లీ రావు. అవి కూడా అయిదేళ్లకు ఓ సారి మాత్రమే జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఓటు వేసే అంశంపై కుటుంబ సభ్యులంతా కూర్చుని చర్చించాం. ముందు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకొని అనంతరం తల్లి అంత్యక్రియలు జరపాలని నిర్ణయించామని యాదవ్ తెలిపారు.

Also Read: మోదీ బాటలోనే..


ఆ క్రమంలో కుటుంబ సభ్యులమంతా ఓటు వేసి.. అనంతరం తన తల్లీ అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు మిథిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల తుది దశ పోలింగ్ శనివారం జరుగుతుంది. ఆ క్రమంలో బిహార్‌లోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.

Also Read: ఆరోపణలపై స్పందించిన డిప్యూటీ సీఎం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Updated Date - Jun 01 , 2024 | 04:49 PM